మన న్యూస్, తాడేపల్లి /నెల్లూరు: గుంటూరు జిల్లా తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో .. వైఎస్ఆర్సిపి రాష్ట్ర పీఏసీ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రులు అంబటి రాంబాబు విడుదల రజని పార్టీ ఎమ్మెల్సీలతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి జగన్ అంటే నమ్మకం - చంద్రబాబు అంటే మోసం* పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని.. పుస్తకాన్ని ఆవిష్కరించారు.కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలు, ఆకృత్యాలను ప్రజలకు తెలియజేసేందుకు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.కూటమి ప్రభుత్వం ప్రజలకు చేసే.. అన్యాయాలు మోసాల పట్ల.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా నిలిచి.. రాబోయే రోజుల్లో మరింత దూకుడుగా పోరాటాలు సాగించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది అని అన్నారు.