సీతారామపురం, మన న్యూస్ : సీతారామపురంలోని బెస్త కాలనీకి చెందిన కిష్టా సురేష్ అనే జన సైనికుడు గత కొద్ది సంవత్సరాలుగా బోన్ క్యాన్సర్ బారిన పడి ఇటీవల మరణించారు. నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ మెంబర్ జనసేన ఉదయగిరి నియోజకవర్గ నాయకుడు భోగినేని కాశీ రావు అమ్మ గారు సులోచన గారు దృష్టికి వాళ్ళు 4 నెలల క్రితం తీసుకురాగా అప్పుడు హాస్పిటల్ ఖర్చుల కోసం 10,000 ఆర్థిక సహాయం చేయడం జరిగింది..కానీ దురదృష్టవశాత్తు అతను 10 రోజుల క్రితం మరణించడం జరిగింది.. ఇప్పుడు పెద్ద కర్మ కోసం కొంచెం అయిన వాళ్ళకు అండగా ఉంటుంది అని 5000 రూపాయలు మరణించిన వ్యక్తి కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని జనసేన వీర మహిళ భోగినేని సులోచనమ్మ, జనసేన నాయకుడు భోగీనేని కాశిరత్తయ్య (గాంధీ) లు మృతుని భార్య లక్ష్మి చేతికి అందజేశారు. మృతుడికి ఒక సంవత్సరం కుమారుడు ఉన్నాడని, నిరుపేద కుటుంబం లోని ఇంటి పెద్దదిక్కు మరణించడంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయిందని, ఆ జనసైనికుడి కుటుంబ స్థితి గతులను నియోజకవర్గ శాసనసభ్యుడు కాకర్ల సురేష్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ అజయ్ కుమార్ గారి దృష్టికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి మృతుని కుటుంబాన్ని ఆదుకునేలా ఏదైనా మార్గం ఉంటే ప్రయత్నిస్తామని తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ మండల ఉపాధ్యక్షుడు ఎస్. రాజశేఖర్, తోట మనోజ్, కొత్త జగదీష్ తదితరులు పాల్గొన్నారు.