ఎస్ ఆర్ పురం, మన న్యూస్... చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో సోమవారం 2025 సంవత్సరంలో షైనింగ్ స్టార్ అవార్డులను చిత్తూరు ఇన్చార్జి మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ చేతుల మీదుగా విద్యార్థులకు అవార్డులను అందించారు ఇందులో భాగంగా గంగాధర్ నెల్లూరు మండలం ఎట్టెరి శ్రీభానోదయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో సైనింగ్ స్టార్ అవార్డు నలుగురు విద్యార్థులు అందుకున్నారు వారిలో మహిమ, కుమార్, జోష్ణ, జైష్ణవి అనే విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించడంతో వీరు నలుగురు సైనింగ్ స్టార్ అవార్డును జిల్లా ఇన్చార్జి మంత్రి రాంప్రసాద్ రెడ్డి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రభుత్వ విప్ ఎంఎల్ఏ డాక్టర్ థామస్ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ చేతుల మీదుగా అందుకున్నారు ఈ కార్యక్రమంలో బానోదయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరస్పాండెంట్ నాగేశ్వరరావు ప్రిన్సిపాల్ లావణ్య ఇంచార్జ్ మౌనిక, ఉపాధ్యాయురాలు భారతి కీర్తి ,షర్మిల, మోహన ,కవిత, దుర్గా, కోమల పుష్ప, వందన, విజయలక్ష్మి, లక్ష్మీ జగదా ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు