మీర్పేట్. మన న్యూస్: కర్మన్ ఘాట్ డివిజన్లోని మందమల్లమ్మ ఎక్స్ రోడ్ సాయిరాం నగర్ కాలనీలోని లక్ష్మీ కన్వెన్షన్ లో ఆర్యవైశ్య సంఘం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య బంధుమిత్రులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు.అందులో భాగంగా పదవ తరగతి,ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారం 2025 అందించారు. ప్రభుత్వ పాఠశాల యందు చదువుకుంటున్న ఆర్యవైశ్య విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ చేశారు.ఆర్యవైశ్య సంఘం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించిన వార్షిక నివేదికను ప్రకటించారు.అంతేకాకుండా తంబోలా,దాండియా కార్యక్రమం నిర్వహించి మొదటి,ద్వితీయ,తృతీయ బహుమతులు అందజేశారు.అనంతరం కార్యక్రమానికి విచ్చేసిన అతిధులకు,ఆర్యవైశ్య సభ్యులకు భోజన సదుపాయాలు కల్పించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మంచన ఫ్రేమ్ కుమార్ గుప్త,ఉప్పల రవీందర్ గుప్త,గుడిపాటి శ్యామ్ ప్రసాద్ గుప్త,మంచన శుభకమార్, వంకొండనాగ శంకర్ గుడ్డి మబ్బ రాజు, లక్ష్మణ్, అన్నారం సురేష్ , మహిళా సంఘ సభ్యులు సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.