మన న్యూస్ కోవూరు:. తెలుగుదేశం పార్టీ కోవూరు నియోజకవర్గ శాసన సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆదేశానుసారం సర్కిల్ ఇన్స్పెక్టర్ వారి కార్యాలయంలో ఆదివారం కోవూరు ఎస్సై రంగనాథ్ గౌడ్ కి తెలుగుదేశం పార్టీ కోవూరు మండల అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి వినతి పత్రం అందించడం జరిగింది . ఈ సందర్భంగా తెలుగుదేశం కోవూరు మండల అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ స్త్రీమూర్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ......,సాక్షి ఛానల్ యజమాని గౌరవ భారతి రెడ్డి ని నేను సూటిగా ఒక మాట అడుగుతున్నాను భారతి రెడ్డి మీ పట్ల మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ మాట్లాడిన మాటలను ఖండిస్తూ తక్షణం వారిని అరెస్టు చేసి జైల్లో పెట్టడం జరిగింది కానీ ఇప్పటిదాకా మీరు వైయస్ జగన్మోహన్ రెడ్డి స్పందించలేదు దీన్నిబట్టే స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ లో మహిళల మీ వైయస్సార్సీపి పార్టీ అనుసరిస్తున్న విధానాన్ని ఆంధ్రప్రదేశ్ మహిళలందరూ ఓటు అనే ఆయుధంతో నిన్ను బెంగళూరు ప్యాలస్కే పరిమితం చేసిన సాక్షి ఛానల్ కు సిగ్గు రాలేదు కనుక రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హోం మినిస్టర్ వంగలపూడి అనిత తక్షణం స్పందించి ఈ వ్యాఖ్యలు చేసిన వారి పట్ల చర్యలు తీసుకొని వారిని తక్షణం అరెస్టు చేయవలసిందిగా కోవూరు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి కోరడమైనది.ఈ కార్యక్రమంలో వేగూరు సర్పంచి కరేటి.అమరావతి మాజీ.ఎంపీపీ వెంకటరమణమ్మ మాజీ ఎంపీపీ.గిద్దలూరు. ఉమా మాజీ సర్పంచ్ పెరిమి చెంచమ్మ పాడుగుపాడు.మాజీ.సర్పంచ్ వనమ్మ నెల్లూరు జిల్లా పెన్నా డెల్టా ఛైర్మెన్ జెట్టి రాజగోపాల్.రెడ్డి మాజీ మండల అధ్యక్షులు.ఇంత మల్లారెడ్డి డీసీఎన్ శ్రీనివాసులు గాదిరాజు సుధాకర్ వేమిరెడ్డి హరికుమార్ రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొనడం జరిగింది.