మన న్యూస్, ఆస్ట్రేలియా/ సర్వేపల్లి: *మెల్ బోర్న్ లో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఆత్మీయలో స్వాగతం పలికిన టీడీపీ – ఆస్ట్రేలియా ప్రతినిధులు.ఈ సందర్భంగా స్వామి రెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ...... ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనే అవకాశం దక్కడం చాలా ఆనందంగా ఉంది అని అన్నారు.తెలుగుదేశం పార్టీలో మూడు తరాలతో కలిసి పనిచేసే అదృష్టం నాకు లభించింది అని అన్నారు.1985లోనే ఎన్టీఆర్ ను కలిసి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించమని కోరాను..అప్పటి రాజకీయ పరిస్థితుల కారణంగా నాకు అవకాశం ఇవ్వలేకపోయారు అని అన్నారు.1987లో నెల్లూరు సెంట్రల్ బ్యాంకు చైర్మన్ గా అవకాశం ఇచ్చారు అని అన్నారు.అప్పట్లో గండిపేటలో ఎన్టీఆర్ నిర్వహించిన శిక్షణ కార్యక్రమాల జ్ఞాపకాలను ఎప్పటికీ మరిచిపోలేను అని అన్నారు.1991లో ఎన్టీఆర్ ఆశీస్సులతో నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాను అని అన్నారు.దూబగుంట రోశమ్మ సారధ్యంలో చేపట్టిన సారా వ్యతిరేక ఉద్యమానికి అఖిలపక్ష కన్వీనర్ గానూ వ్యవహరించాను అని అన్నారు.ఉమ్మడి ఏపీలో 22 జిల్లాల్లో సారా వేలం పాటలు నిర్వహించగా, ఒక్క నెల్లూరు జిల్లాలో మాత్రం జరగకుండా అడ్డుకున్నాం అని అన్నారు.పెద్దాయన ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లి సారా వ్యతిరేక ఉద్యమం గురించి వివరించాం. ఆ వెంటనే నెల్లూరు పర్యటనకు వచ్చిన ఆయన వీఆర్సీ మైదానంలో నిర్వహించిన సభలో సంపూర్ణ మద్యపాన నిషేధం హామీ ఇచ్చారు అని అన్నారు.సారా నిషేధం గురించి ప్రకటన చేస్తారని భావిస్తే ఏకంగా సంపూర్ణ మద్యపాన నిషేధం హామీ ఇవ్వడాన్ని ఊహించలేకపోయాం అని అన్నారు.1994లో మూడో సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే సంపూర్ణ మద్యపాన నిషేధం ఫైలుపై సంతకం పెట్టారు అని అన్నారు.ఎన్టీఆర్ ఆశీర్వాదంతోనే 1994లో మొదటిసారిగా ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశం దక్కింది అని అన్నారు.పరిశ్రమలకు కేటాయించే భూములకు సంబంధించి అసైన్డ్ పట్టాలు కలిగిన రైతులకు కూడా పరిహారం ఇవ్వడం ప్రారంభించిన నాయకుడు ఎన్టీఆర్ అని అన్నారు.పింఛన్, పక్కా గృహం, మండలాలు, సింగిల్ విండో వ్యవస్థ...ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నో పాలనాపరమైన సంస్కరణలు ఆయన హయాంలోనే అమలులోకి వచ్చాయి అని అన్నారు.ఉచిత విద్యుత్ పథకానికి కూడా ఆధ్యులు ఎన్టీఆరే. ఇప్పుడు 9 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తుంటే ఆ రోజుల్లోనే హార్స్ పవర్ కు కేవలం రూ.50 తీసుకుని 18 గంటల పాటు విద్యుత్ అందించిన రైతు బాంధవుడాయన అని అన్నారు.దేశంలోనే తొలిసారిగా నదుల అనుసంధానానికి తెలుగు గంగ ప్రాజెక్టుతో ఆయనే శ్రీకారం చుట్టారు అని అన్నారు.ఉమ్మడి ఏపీలోనే ఏ జిల్లాకు లేని విధంగా నెల్లూరులో 146 టీఎంసీల సామర్ధ్యం కలిగిన సోమశిల, కండలేరు జలాశాయాలను అందించారు అని అన్నారు.నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా జాతీయ రాజకీయాలను శాసించారు అని అన్నారు.ఎన్టీఆర్ బాటలోనే చంద్రబాబు నాయుడు ఎన్నో కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టి విజనరీ లీడర్ గా గుర్తింపు పొందారు అని అన్నారు.వైసీపీ పాలనలో జరిగిన అరాచకాలకు ఎదురునిలిచి యువగళం పాదయాత్రతో నారా లోకేష్ బాబు ప్రజలను చైతన్యవంతం చేశారు అని అన్నారు.ఏపీని సర్వనాశనం చేసిన జగన్ రెడ్డి ధనదాహానికి రాష్ట్రంలో జరిగిన లిక్కర్ స్కామే నిదర్శనం అని అన్నారు.దేశమంతా డిజిటల్ కరెన్సీ అంటుంటే ఏపీని మాత్రం క్యాష్ ఆంధ్రప్రదేశ్ గా మార్చి వేలాది కోట్లు కొల్లగొట్టారు అని అన్నారు.కమీషన్లు ఇవ్వలేదని ఎంఎన్సీ కంపెనీలను సైతం మూతేసేశారు అని అన్నారు.ఢిల్లీలో రూ.150 కోట్ల మద్యం స్కామ్ లో ఒక సీఎం, డిప్యూటీ సీఎం, ఎంపీలు, ఏపీ, తెలంగాణ, తమిళనాడు నాయకులు అరెస్ట్ అయ్యారు అని అన్నారు.ఏపీలో ఏకంగా రూ.10 వేల కోట్ల వరకు స్కామ్ జరిగింది అని అన్నారు.తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని రూ.43 వేల కోట్లు దోచేసిన ముఖ్యమంత్రి కుమారుడిగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోయాడు అని అన్నారు.వైసీపీ పాలన మొత్తం అవినీతి, అరాచకాలు, దోపిడీలు, విధ్వంసాలకు మారుపేరుగా నిలిచింది అని అన్నారు.40 ఏళ్లకు పైగా రాజకీయాల్లో ఉన్న నాపై ఎప్పుడూ కేసులు లేవు. వైసీపీ ఐదేళ్ల పాలనలో నాపై 18 అక్రమ కేసులు బనాయించారు అని అన్నారు.నా నియోజకవర్గం సర్వేపల్లిలో 70 మంది జైలుపాలయ్యారు. 90 మంది వరకు ముందస్తు బెయిల్ వచ్చే వరకు నెలల తరబడి ఊళ్లు వదిలిపోయారు అని అన్నారు.ఇవన్నీ చూసిన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం 2024లో చారిత్రాత్మక తీర్పు ఇచ్చారు అని అన్నారు.2024 జూన్ 4 ఏపీలో ప్రజాస్వామ్యం బతికిన రోజు.. అని తెలిపారు.