కలిగిరి, మన న్యూస్ : ఉదయగిరి నియోజకవర్గం లోని బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులందరికీ రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వాహ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు నియోజకవర్గంలోని ప్రతి ముస్లిం సోదరలందరికి శుభాకాంక్షలు తెలిపారు. త్యాగాలకు ప్రతీక అయినా ఈజ్ ఆల్ అదా,( బక్రీద్), పండుగను ముస్లిం సోదరులందరూ భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వాహ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ దేవునిపై విశ్వాసం ఉంచి సన్మార్గం లో జీవించాలని ఈద్ అల్ అదా తెలియ చేస్తుందని, తమకు ఉన్నదాంట్లో నుంచి ఇతరులకు పంచిపెట్టే దాతృత్వ స్ఫూర్తిని బక్రీద్ కలుగజేస్తుందన్నారు. మన రాష్ట్రంలోని, మన జిల్లా లోని, మన నియోజకవర్గం లోని,ముస్లింలందరూ ఈ పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఆయన కోరెరు.రాష్ట్ర ప్రజలపై ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, యువ నాయకుడు మంత్రి నారా లోకేష్ బాబు, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పై ఆ అల్లా ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అదేవిధంగా నియోజకవర్గంలోని 8 మండలాల్లో ఉన్నటువంటి ముస్లిం సోదర సోదరీమణులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు.