వింజమూరు, మన న్యూస్ : బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులందరికి ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు ఒక ప్రకటనలో బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.త్యాగాలకు ప్రతీక అయిన ఈద్ అల్ అదా (బక్రీద్) పండుగను ముస్లీం సోదరులందరూ భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఎమ్మెల్యే ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ దేవుని పై విశ్వాసం ఉంచి సన్మార్గంలో జీవించాలని ఈద్ అల్ అదా తెలియజేస్తుందని, తమకు ఉన్నదాంట్లో నుంచి ఇతరులకు పంచి పెట్టే దాతృత్వ స్ఫూర్తిని బక్రీద్ కలుగజేస్తుందన్నారు. రాష్ట్రంలోని ముస్లింలందరూ ఈ పండుగను సంతోషంగా జరుపుకోవాలని, రాష్ట్ర ప్రజలపై, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి శ్రీ నారాచంద్రబాబు నాయుడు, యువ నాయకుడు మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ పై ఆ అల్లా ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.