జలదంకి, మన న్యూస్ : జలదంకి మండలం చామదల గ్రామానికి చెందిన రాపూరి కౌసల్య తల్లిదండ్రులను కోల్పోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉండగా ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ శ్రీ కాకర్ల చారిటబుల్ ట్రస్టు ద్వారా పదివేల రూపాయలను తక్షణ ఆర్థిక సహాయం అందజేశారు. శుక్రవారం మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారికి కౌసల్య ఇబ్బందుల గురించి స్థానిక నాయకులు తెలియజేయగా, వారి నివాసానికి వెళ్లి బాలికను ఓదార్చి, 10,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఎప్పుడు ఎలాంటి కష్టం వచ్చినా నా దృష్టికి తీసుకురావాలని, మీకు తెలుగుదేశం పార్టీ నేను ఎల్లవేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జలదంకి మండలం మరియు గ్రామ నాయకులు పార్టీ అభిమానులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.