మన న్యూస్ ,కావలి: ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ....కావలి నియోజకవర్గంలో అరాచకపాలన జరుగుతుంది అని అన్నారు.కావలి ప్రజలకు ఎమ్మెల్యేగా మీరేమి చేశారో చెప్పకుండా గత ప్రభుత్వం ఏమి చేసింది అనేదాని గురించి మాట్లాడటం మీ మోసపూరిత ప్రభుత్వం పనితీరుకి నిదర్శనం అని అన్నారు.స్కూల్లో పిల్లలకి పాఠాలు చెప్పిన విధంగా ఎమ్మెల్యే గారి ప్రజెంటేషన్ ఉంది అని అన్నారు.కలుగోళమ్మ బ్రిడ్జికి సంబంధించి అండర్ పాస్ సెనెక్షన్ చేయించి , టెండర్ పిలిచి వచ్చే సంవత్సరం జూన్ 3వ తేదీ లోపల పూర్తి చేస్తా అని మాట ఇవ్వగలవా..? అని అన్నారు.ముసునూరు నుండి మద్దూరుపాడు వరకు మా ప్రభుత్వంలో తీసుకొచ్చిన కాంట్రాక్ట్ రోడ్డు వేయడానికి కంకర కావాల్సి వచ్చింది కానీ ఆరోజు ఎమ్మెల్యే అక్రమ క్వారీ సీజ్ చేయడం వలన కంకర కొరత ఏర్పడింది.. తదుపరి చీమకుర్తి నుండి తీసుకురావడానికి రేట్లు కుదరక ఆ రోడ్డు చేయలేకపోయాము..కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఆ కాంట్రాక్ట్ ని రద్దు చేసిన ఘనత ఎమ్మెల్యే కావ్య కృష్ణా రెడ్డిది అని అన్నారు. కొత్త పనులు తీసుకొచ్చేది దేవుడికిఎరుగు కానీ ఉన్న పనులు రద్దు చేసిన ఘనత ఎమ్మెల్యే ది.. అని అన్నారు. తుమ్మలపెంట రోడ్డుకి సంబంధించిన ప్లాన్ ప్రకారం వేయకుండా ఎదో హడావిడిగా వేసి తూ తూ మంత్రంగా పని పూర్తి చేసారు.. అని అన్నారు.నేనేదో కాంట్రాక్టర్స్ ని బెదిరించి కమిషన్స్ అడిగాను అని చెప్పే ఎమ్మెల్యే మీరు చేసిన ఫిషింగ్ హార్బర్ కాంట్రాక్ట్ లో నాకు ఎంత కమిషన్ ఇచ్చారో ప్రజలకు చెప్పగలరా..? అని అన్నారు.ఊరికే బురద చల్లే కార్యక్రమాలు చేయొద్దని ఎమ్మెల్యే కి విన్నవించ్చుకుంటున్నాను అని అన్నారు.ముఖ్యంగా ఎమ్మెల్యే దగ్గర ఉండే నలుగురు బకారాలు కి నేను చెప్పేది ఒకటే వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి , కావలిలో ఎమ్మెల్యే గా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి రాకూడదని దేవుడిని కోరుకోవాలి మేము వచ్చాము అంటే గుడ్డలు ఊడదీసి సినిమా చూపిస్తాం.. అని అన్నారు.నేను ఏది మాట్లాడిదే అదే రాయండి... కృష్ణా రెడ్డి ఏది మాట్లాడితే అదే రాయండి తప్పులేదు అంతేకానీ వక్రీకరించి రాయడం ఎంత వరకు కరెక్ట్..? అని అన్నారు.నోటికాడ కూడు తీసే పనులు మేమెప్పుడు చేయలేదు కానీ ఈరోజు ఎమ్మెల్యేగా కృష్ణా రెడ్డి చేస్తున్నారు అని అన్నారు.ఈరోజు వైస్సార్సీపీకి చెందిన నాయకులను బెదిరించి టీడీపీలోకి చేర్చుకుంటున్నారు.. అని అన్నారు.కావలి నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విదంగా కోళ్లపందాలు , పేకాట , డైమాన్ డబ్బా , రికార్డింగ్ డాన్సులును ప్రోత్సహిస్తున్న ఘనత ఎమ్మెల్యేగారిది.. అని అన్నారు.కావలి తటీడీపీలో పార్టీ పుట్టినప్పుడు నుండి ఉన్న నాయకులు ఈరోజు కావ్య కృష్ణా రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత ఎక్కడా కూడా వారు అసలకి కనపడట్లేదు పార్టీ మీటింగ్ స్టేజి మీద కానీ మొన్న జరిగిన మహానాడులో కానీ వారు తప్ప వైస్సార్సీపీ నుండి వలసలు వెళ్లిన వారు మాత్రనే కనపడుతున్నారు.. అని అన్నారు.కమ్మ సామాజికవర్గాన్ని నేనెప్పుడు ఏమి అనలేదు ఆనను కూడా..ఎందుకంటే కమ్మ సామాజిక వర్గానికి నాకు చాలా దగ్గర దగ్గర సంబంధాలు ఉన్నాయి..నాకు ఉండే స్నేహితుల్లో చాలా మంది కమ్మ సామాజికవర్గానికి చెందిన వారే.. అని అన్నారు.ఈమధ్య ఉదయగిరి బ్రిడ్జి రోడ్డులో నూతనంగా నిర్మించిన మున్సిపాలిటీ షాపులులో చాలా అవినీతి జరుగుతుంది..పేద వ్యాపారస్తుల దగ్గర ఒక్క షాప్ కి 5000 వేల రూపాయలు బాడుగ మరియు డిపాసిట్ లక్ష 50 వేళా రూపాయలు నిర్ణయించారు.. అని అన్నారు.అంత అంత డబ్బు పేద వ్యాపారస్తులు ఎక్కడ నుండి తీసుకొస్తారు..? వ్యాపారస్తులకు అండగా త్వరలోనే మేమంతా ఒక కార్యక్రమం చేపడుతాం అని అన్నారు.