మన న్యూస్ సింగరాయకొండ:-
ప్రకాశం జిల్లా పాత సింగరాయకొండలోని దక్షిణ సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలకు శుభారంభం జరిగింది. ఈ ఉత్సవాలు జూన్ 6 నుండి జూన్ 16, 2025 వరకు వైభవంగా జరగనున్నాయి.
ఈ బ్రహ్మోత్సవ మహోత్సవాలకు భాగంగా, తొలి రోజు అయిన 06-06-2025 శుక్రవారం రాత్రి 8 గంటలకు అంకురార్పణ కార్యక్రమం ఆలయంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. పూజారులు వేదమంత్రోచ్ఛారణల నడుమ శుభ ముహూర్తంలో అంకురార్పణ కార్యక్రమాన్ని ఆచరించారు. ఈ అంకురార్పణతో స్వామివారి వార్షిక ఉత్సవాలకు పునాది పడింది.