మన న్యూస్ తవణంపల్లె జూన్-4
పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లె మండలం, కాణిపాకంపట్నం గ్రామంలో జరిగిన గంగమ్మ జాతరలో పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ పాల్గోన్నారు. గంగ జాతర సందర్బంగా కాణిపాకంపట్నంకు విచ్చేసిన *పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ కి* తవణంపల్లె మండల నాయకులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన గంగమ్మ వారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం అర్చకులు అమ్మవారి తీర్ధ ప్రసాదాలను అందజేశారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేలా అమ్మవారి చల్లని చూపు ప్రజలపై ఉండాలని ఆయన కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తవణంపల్లె మండల అధ్యక్షులు గాలి దిలీప్ కుమార్ నాయుడు, ఐరాల మండల అధ్యక్షులు గంగారపు హరిబాబు నాయుడు, యాదమరి మండల అధ్యక్షులు మురార్జీ యాదవ్, పూతలపట్టు మండల అధ్యక్షులు దొరబాబు చౌదరి, బంగారుపాళ్యం మండల అధ్యక్షులు ఎన్.పి.ధరణీ నాయుడు మరియు మండల నాయకులు, కార్యకర్తలు పాల్గోన్నారు.