మన న్యూస్ పుతలపట్టు నియోజకవర్గం జూన్-4
పూతలపట్టు నియోజకవర్గంలో వేరుశెనగ గింజల కొరత తీవ్రంగా ఉండటంతో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెం నాయుడు తో టెలిఫోన్ ద్వారా పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ మాట్లాడారు. తక్షణమే అవసరమైన గింజలను మరింత అధికంగా అందించాలని విజ్ఞప్తి చేశారు. వేరుశెనగ విత్తనాల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సాగు సీజన్ మొదలైనప్పటికీ సరిపడా విత్తనాలు లభించకపోవడం వల్ల వ్యవసాయ కార్యాలు నిలిచిపోయే పరిస్థితి నెలకొనిందని ఎమ్మెల్యే తెలిపారు. పూతలపట్టు నియోజకవర్గానికి అత్యవసరంగా అదనంగా విత్తనాలను తరలించాలని మంత్రి అచ్చెం నాయుడిని కోరినట్లు చెప్పారు. మంత్రి అచ్చెం నాయుడు ఈ అంశంపై సానుకూలంగా స్పందించారని, జిల్లా వ్యవసాయ అధికారులతో సంప్రదించి త్వరలోనే అవసరమైన వేరుశెనగ గింజలు పంపిణీ అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఆయన చెప్పారు.