మన న్యూస్ తవణంపల్లె జూన్-4
తవణంపల్లి మండల కేంద్రం తవణంపల్లి మండల సమైక్య వెలుగు కార్యాలయంలో అంగనవాడి కార్యకర్తలు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా అంగన్వాడి సిడిపిఓ నిర్మల పాల్గొని ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడి పరిధిలోని అంగన్వాడి పిల్లలు ప్రతి ఒక్కరు హాజరుకావాలని పిల్లలు న్యూట్రిషన్ తగ్గకుండా న్యూట్రిషన్ పెరుగుదల పిల్లలు ఆరోగ్యం అభివృద్ధి చెందాలని అంగనవాడి సెంటర్ కి సెలవులు లేదని సెలవులు ఉన్న సమయంలో కూడా అంగన్వాడి సెంటర్ పనిచేస్తుందని పిల్లలను రోజు మానిటీరింగ్ చేయాలని తల్లిదండ్రులకు పిల్లల ఆరోగ్యం పెరుగుదల గూర్చి తెలియజేయాలని తెలియజేశారు. ఈకార్యక్రమంలో మండలంలోని అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.