మన న్యూస్, వెంకటగిరి:* కూటమి నాయకుల ఇచ్చిన హామీలు తుంగలో తొక్కి మోసం చేస్తున్న వైనాన్ని ప్రజలకు వివరించేందుకే వెన్నుపోటు దినం * కూటమి నాయకుల మోసాలపై ధ్వజమెత్తిన నేదురుమల్లి * ప్రజలంతా పాల్గొని కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి హామీలను అమలు చేసుకోవాలి * వెన్నుపోటు దినమును ఎల్లో మీడియా వక్రీకరించడం హేయం * మీడియా సమావేశంలో వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వెల్లడిఏడాది పాలనలో ఓటు వేసిన ప్రజలకు టిడిపి జనసేన నాయకులు వెన్నుపోటు పొడిచారని, అధికారంలోకి వచ్చిన తరువాత సూపర్ సిక్స్ పథకాల్లో ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేదని, మోసపూరిత వాగ్ధానాలతో ఆర్భాటం తో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేసినందుకే వైఎస్ఆర్సిపి వెన్నుపోటు దినమును నిర్వహిస్తుందని వెంకటగిరి నియోజకవర్గ వైయస్సార్సీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి తెలియజేశారు. స్థానిక నేదురుమల్లి నివాసంలోని ఎన్ జే ఆర్ భవన్ లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..... తను అధికారంలోకొస్తే సంపద సృష్టించి హామీలను నెరవేరుస్తానని ఒకాయన, హామీలు నెరవేర్చకపోతే కాలర్ పట్టుకున్న ఓ యువ నేత, ప్రశ్నించేందుకే రాజకీయాల్లోకి వచ్చానన్న మరోకూటమి నాయకుడు హామీలు నెరవేర్చకపోవడం ఏమిటని ప్రశ్నించారు. కూటమి నాయకులకు వైఎస్ఆర్సిపి కి వచ్చిన 11 సీట్లు కనబడుతున్నాయని 40 శాతం ఓట్లు కనిపించడం లేదని విమర్శించారు. గత ఎన్నికల్లో రాష్ట్రంలోని వైయస్సార్సీపీకి తప్ప ఏ పార్టీకి 40 శాతం ఓటింగ్ వచ్చిందా అని అన్నారు. ఇది - వెన్నుపోటు కాదా..?ఒక్క ఎన్నికల హామీని కూడా కూటమి ప్రభుత్వం అమలు చేయకపోవడం వెన్నుపోటు కాదా అని నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ప్రశ్నించార. కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసేటప్పుడు టిడిపి జనసేన నాయకులు మాత్రమే ఉన్నారని గుర్తు చేశారు.పాఠశాలకు వెళ్లే ప్రతి బిడ్డకు నీకు 15000 నీకు 15000 అంటూ ఆర్భాటం చేసి అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో అమ్మ ఒడి పథకానికి పేరు మార్చడం తప్ప నిధులు విడుదల చేయకపోవడం వెన్నుపోటు కాదా అని అన్నారు .నిరుద్యోగ యువతకు రూ 3000 మృతి ఇస్తామంటూ హామీ ఇచ్చి దానిని విస్మరించడం వెన్నుపోటు కాదా అన్నారు .రైతు భరోసా పేరు మరైతుకు రూ 20,000 ప్రతి రైతుకు ఏటా ఇస్తామన్న ప్రభుత్వం ఏ ఒక్క రైతు కన్నా రూపాయి జమ చేసిందా అని దీనిని వెన్నుపోటు అనరా అని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు, 18 సంవత్సరాల నిండిన యువతలకు నెల నెల 1500 ఇస్తామన్న హామీ తుంగలో తొక్కడం వెన్నుపోటు కాదా అన్నారు .అమరావతి పేరుతో అప్పులు తేవడం తప్ప కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా గ్రాంట్ గా తీసుకు రాలేదని, రాష్ట్రం చేస్తున్న అప్పుకు కేంద్రం గ్యారెంటీ ఇచ్చిందని, రాష్ట్రం ఆ నిధులు చెల్లించకపోతే రాష్ట్రానికి రావలసిన జీఎస్టీ నిధులతో చేసిన అప్పు తీరుస్తారని చెప్పారు . పింఛన్ 4000 పెంచారని , వైఎస్ఆర్ సీపీకి మద్దతుగా నిలిచారన్న కారణంతో రెండు కాళ్లు లేని అర్హునికి పింఛన్ కోత పెట్టారని, ఇదే తరహాలో రాష్ట్రంలో వివిధ కారణాలతో ఎంతోమంది అర్హులకు కోత పెట్టారో తన వద్ద డేటా ఉందన్నారు.40 ఏళ్లలో తొలిసారిగా కడపలో మహానాడు నిర్వహించామని గొప్పలు చెప్పుకుంటున్న టిడిపి నాయకులు వారికి ఓటేసిన ప్రజల గడప వద్దకు వెళ్లి తాము ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించగలరా అని ప్రశ్నించారు.ఇక బుధవారం నియోజకవర్గంలోని రాపూరు లో వెన్నుపోటు దినం నిర్వహిస్తున్నామని, ఇకపై నియోజకవర్గంలోని ప్రతి మండలంలో ప్రజా మద్దతుతో ప్రభుత్వం కళ్లు తెరిపించేలా కార్యక్రమాలు నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామన్నారు. వెన్నుపోటు దినం శాంతియుత ర్యాలీగా కార్యక్రమం జరుగుతుందని ఈ మేరకు సంబంధిత అధికారులను అనుమతి కోరినట్లు వివరించారు. నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలు వెన్నుపోటు దినం కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.