మన న్యూస్ ,కోట : * తిరుపతి జిల్లా కోటలోని షాదీమంజిల్ లో అట్టహాసంగా గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ జన్మదిన వేడుకలు జరిగాయి. *కోట షాదీమంజిల్ లో భారీ కేక్ కటింగ్, 400 మందికి అన్నదానం ఏర్పాటు చేశారు.*టీడీపీ నాయకులు జలీల్, మోహన్ రెడ్డి, మధుయాదవ్ ల ఆధ్వర్యంలో*టీడీపీ దిగ్గజాలు చిల్లకూరు దశరధరామిరెడ్డి, పలగాటి భాస్కర్ రెడ్డి, కత్తి విజయభాస్కర్ రెడ్డి లు విశిష్ట అతిదులుగా అట్టహసంగా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ గూడూరు ఎమ్మెల్యే పాశిం కుమార్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. *కోట, విద్యానగర్ లలో ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ కు శుభాకాంక్షలు తెలుపుతూ భారీగా ఫ్లెక్సీల ఏర్పాటు చేశారు.*ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ సేవలను కొనియాడిన టీడీపీ నాయకులు.*ఎమ్మెల్యే డా.పాశిం సునీల్ కుమార్ హయాంలోనే మూడు తరాలు గుర్తుంచుకునేలా గూడూరు నియోజకవర్గ అభివృద్ధి చేశారు.*ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 'ఇంటింటికి తెలుగుదేశం - ఇంటింటికి పాశిం సునీల్ కుమార్' తో సమస్యల గుర్తింపు.*అధికారంలోకి వచ్చాక త్వరితగతిన సమస్యల పరిష్కారం, *ప్రతి శనివారం 'ఎమ్మెల్యే గ్రీవెన్స్ డే'నిర్వహిస్తున్నారు.*గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరుజిల్లాలో విలీనం చేసందుకు గాను అసెంబ్లీ సమావేశాల్లో తన వాణిని బలంగా వినిపిస్తున్న ఎమ్మెల్యే.*నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ జనం మెచ్చిన ఏకైక ఎమ్మెల్యేగా ముద్రపడిన డా.పాశిం సునీల్ కుమార్ *నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి.. ప్రజల దీవెనలతో మరెన్నో సంవత్సరాలు ఎమ్మెల్యేగా సేవ చేయాలి *.దేవుని దీవెనలతో మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలి.. పేద ప్రజలకు ఆయన సేవలు నిరంతరం కొనసాగాలి*టీడీపీ కార్యకర్తలకు కొండంత అండ, బలం ఎమ్మెల్యే సునీల్ కుమార్ *సునీల్ కుమార్ నాయకత్వం వర్ధిల్లాలి, హ్యాపీ బర్త్డే టూ ఎమ్మెల్యే సునీల్ కుమార్ అంటూ నినాదాలు చేశారు. *ఎమ్మెల్యే పాశింకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తెలుగు తమ్ముళ్లు.*టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో కిక్కిరిసిన కోటలోని షాదీమంజిల్ ప్రాంగణం.తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలోని షాదీమంజిల్ లో మంగళవారం కోట మండలానికి చెందిన టీడీపీ నాయకులు షేక్ జలీల్ అహ్మద్, నెల్లూరు మోహన్ రెడ్డి, కోకోర్ల మధుయాదవ్ ల ఆధ్వర్యంలో తెలుగుదేశంపార్టీ దిగ్గజాలు చిల్లకూరు దశరధరామిరెడ్డి, పలగాటి భాస్కర్ రెడ్డి, వాకా విజయభాస్కర్ రెడ్డి లు విశిష్ట అతిదులుగా యంగ్ అండ్ డైనమిక్ లీడర్, గూడూరు నియోజకవర్గ ప్రదాత, గూడూరు ఎమ్మెల్యే డా.పాశిం సునీల్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. 400 మందికి భారీ అన్నదానం ఏర్పాటు చేసారు. తొలుత తెలుగుదేశం పార్టీ శ్రేణుల నడుమ టీడీపీ నాయకులు, చిల్లకూరు దశరధరామిరెడ్డి, పలగాటి భాస్కర్ రెడ్డి, జలీల్ అహ్మద్, వాకా విజయ్ భాస్కర్ రెడ్డిలు పాశిం జన్మదిన కేక్ ను కట్ చేసి నాయకులకు తినిపించారు. 'సునీల్ కుమార్ నాయకత్వం వర్ధిల్లాలి, హ్యాపీ బర్త్డే టూ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా పలువురు టీడీపీ నాయకులు మాట్లాడుతూ... రాబోవు మూడు తరాలు గుర్తుంచుకునేలా గూడూరు నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ అభివృద్ధి చేసి గూడూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాతగా, జనం మెచ్చిన నాయకుడిగా ముద్రపడ్డారని అన్నారు. గూడూరు నియోజకవర్గ ప్రజలకు అన్నివేళలా అందుబాటులో ఉంటూ, ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ, గూడూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన సునీల్ కుమార్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, నియోజకవర్గ ప్రజల దీవెనలతో మరెన్నో సంవత్సరాలు ప్రజలకు సేవ చేయాలని, వారి దీవెనలతో మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని భగవంతుని కోరుకుంటున్నామని ఆకాంక్షించారు. ఆయన సేవలు పేద ప్రజలకు నిరంతరం కొనసాగాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ టీడీపీకి ఘన విజయాలు చేకూర్చేలా పార్టీ శ్రేణులు సైనికుల్లా కృషి చేయాలని వారు సూచించారు.తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు జలీల్ అహ్మద్ మాట్లాడుతూ.. గూడూరు ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ చేసిన సేవలను విశేషంగా కొనియాడారు. అధికారంలో ఉన్నా.. ప్రతి పక్షంలో ఉన్నా.. ఓడినా.. గెలిచినా.. ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజా శ్రేయస్సు కోసం నిరంతరం తపనపడే నాయకుడు ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ అని జలీల్ అహ్మద్ అన్నారు. 'ఇంటింటికి తెలుగుదేశం ఇంటింటికి పాశిం సునీల్ కుమార్' నినాదంతో ప్రతి ఇంటికి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకుని, ఆ సమస్యలను పరిష్కరిస్తామని వారికి భరోసా ఇచ్చి, అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే వారి సమస్యలు పరిష్కరించి 'మాటల నాయకుడు కాదు చేతల నాయకుడి'గా కీర్తింపబడ్డారన్నారు. నిత్యం గూడూరు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ తన కార్యాలయంలో 'ప్రతి శనివారం గ్రీవెన్స్ డే' నిర్వహిస్తూ ప్రజా సమస్యలకు అధికారుల ద్వారా అనతికాలంలోనే పరిష్కరిస్తూ, మన్ననలు పొందుతూ జనం మెచ్చిన ఎమ్మెల్యే గా ముద్రపడ్డారని అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎంతో మంది అభాగ్య కుటుంబాలను ఆదుకున్నారని గుర్తు చేసారు. ప్రజల గుండెల్లో ఆయనకు సుస్థిరస్థానం కలదని జలీల్ అన్నారు.గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే సునీల్ కుమార్ నేతృత్వంలో అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని, ముఖ్యంగా కోట మండలంలో కోట్లాది రూపాయల ప్రభుత్వ నిధులతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. అధిష్టానం వద్ద పట్టుబట్టి మరీ గూడూరు నియోజకవర్గానికి కోట్లాది రూపాయల నిధులు, అభివృద్ధి పనులు తీసుకొస్తున్నారని అన్నారు. గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరుజిల్లాలో విలీనం చేసందుకు గాను కృషి చేస్తున్నారని, అసెంబ్లీ సమావేశాల్లో తన వాణిని బలంగా వినిపిస్తున్నారని అన్నారు. గూడూరు నియోజకవర్గ ప్రజలు చిరకాలం గుర్తుపెట్టుకునే విధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజల మన్ననలను పొందారన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలకు కొండంత అండ, బలం ఎమ్మెల్యే సునీల్ అని కొనియాడారు. ఎమ్మెల్యే పాశిం పుట్టినరోజు పురస్కరించుకొని కోట పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు హాజరవ్వడంతో షాదీమంజిల్ ప్రాంగణం కిక్కిరిసింది. కోట, విద్యానగర్ లలో ఎమ్మెల్యే పాశిం శుభాకాంక్షలు తెలుపుతూ భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి అభిమానాన్ని చాటుకున్నారు.ఈ జన్మదిన వేడుకల్లో టీడీపీ సీనియర్ నాయకులు చిల్లకూరు దశరధరామిరెడ్డి, పలగాటి భాస్కర్ రెడ్డి, నెల్లూరు మోహన్ రెడ్డి, పలగాటి జితేంద్ర రెడ్డి, యరటపల్లి వసంత కుమార్ రెడ్డి, యరటపల్లి శ్యామసుందర్ రెడ్డి, కోట బిట్-3,1 ఎంపీటీసీలు షేక్ షంషుద్దీన్, దారా సురేష్, మర్రి పోలయ్య, కోకొర్ల మధు యాదవ్, తిరుమలశెట్టి కోటేశ్వరరావు, షేక్ బాబు, షేక్ నౌషాద్, షేక్ నాయబ్ రసూల్, మర్రి అనిల్, తల్లం శ్రీనివాసులు, నందం మోహన్, గూడూరు కిరణ్, మహిళా నాయకులు సుహాసిని, సిద్దపరెడ్డి పోలమ్మ, నీలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.