జర్నలిస్టుల కుటుంబానికి తాను అండగా ఉంటా జీడి నెల్లూరు ఎమ్మెల్యే
మన న్యూస్,ఎస్ఆర్ పురం :- జర్నలిస్టు కుటుంబాన్ని పరామర్శించిన ప్రభుత్వ విప్ జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం థామస్ ఎస్ ఆర్ పురం మండలం పెద్ద తయ్యూరు గ్రామానికి చెందిన గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఏపీయూడబ్ల్యూజే యూనియన్ ప్రెస్ క్లబ్ ఈసీ మెంబర్ స్వతంత్ర టీవీ జర్నలిస్ట్ సతీష్, చిన్నాన్న సంఘమిత్ర శకుంతల భర్త, రాదయ్య అనారోగ్యంతో ఇటీవల కాలంలో మృతి చెందారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ,జీడి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం థామస్ మంగళవారం వారి కుటుంబాన్ని పరామర్శించారు. తాను అన్ని విధాల జర్నలిస్టుల కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జయశంకర్ నాయుడు, నియోజకవర్గ ఎస్సి సెల్ ప్రధాన కార్యదర్శి కుమార్ మండల ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు నాగరాజు, మీడియా కోఆర్డినేటర్ కుప్పయ్య, మధు, రమేష్, లవ్ కుమార్, టిడిపి నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు