మన న్యూస్: మణుగూరు, సత్వరమే కొత్త బొగ్గు గనులు ప్రారంభించాలి మణుగూరు మనుగడకై సింగరేణి ఆధ్వర్యంలో కొత్త బొగ్గు గనుల ఏర్పాటు ఉన్నగనులకు విస్తరణ అనుమతులు సాధించాలని కోరుతూ పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు సహకారంతో ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో లో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ,సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి,మహబూబా బాద్ ఎంపీ పొరిక బలరాం కి శుక్ర వారం నాడువినతి పత్రాలు అందజేసినట్లు ఐఎఫ్ టీ యు అనుబంధ గోదావరిలోయ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి యస్ డి నా సర్ పాషా విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియాలో ప్రస్తుతం బొగ్గు ఉత్పత్తి ప్రక్రియ కొనసాగుతున్న ఓసి గనులు మూత పడనున్నాయని. కొత్త గనులు ప్రారంభం కాకపోతే మణుగూరు ఏరియా మనుగడ ప్రశ్నార్థకం అయ్యే అవకాశం ఉందని ,తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మణుగూరులో కొత్త గనుల ఏర్పాటుకు సత్వర చర్యలు చేపట్టాలి, ఉన్న గనులకు విస్తరణ అనుమతులు సాధించాలని. అన్ని గనులు సింగరేణి ఆధ్వర్యంలోనే నడిపించాలని ప్రజా ప్రతినిధులను కోరినట్లు ఆయన తెలిపారు. దీంతోపాటు మణుగూరుకు వరద ముంపు నివారిస్తూ శాశ్వత పరిష్కారం చూపాలని, ఇటీవల భారీ వర్షాలకు వరద ముంపునకు గురై సర్వం కోల్పోయిన నిరాశ్రయులకు ఇందిరమ్మ పక్కా ఇల్లు నిర్మించాలని కోరారు. అలాగే సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని,సింగరేణి భూ నిర్వాసితులకు, ప్రభావిత గ్రామాల యువతకు, సింగరేణి డిపెండెంట్ లకు, స్థానికులకు సింగరేణి ఓబి కంపెనీలలో, సెక్యూరిటీ, ఇతర సివిల్ కాంటాక్ట్ పనులలో ఉపాధి అవకాశాలు కల్పించాలని,మణుగూరులో ట్రాఫిక్ నివారణకు ఆటోనగర్ ఏర్పాటు చేయాలని పదవీ విరమణ చేసిన సింగరేణి కార్మికులు మణుగూరులో ఐదు సెంట్ల భూమిలో గృహ నిర్మాణం చేపడితే ఇబ్బందులు లేకుండా చూడాలని కోరినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గుడిపూడి కోటేశ్వరరావు, ఎస్ డి హుమాయూన్ తదితరులు పాల్గొన్నారు.