.మన న్యూస్ ,నెల్లూరు: *యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధిగా చీదెళ్ళ కిషన్ నియమితులవడంపై హర్షం *ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుకున్న చిదేళ్ళ కిషన్.నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ కార్యాలయంలో వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని వైఎస్ఆర్సిపి యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులైన సందర్భంగా చీదెళ్ల కిషన్ చంద్రశేఖర్ రెడ్డి ని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా 100 మంది యువతతో కలిసి కేక్ కటింగ్ జరిపి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని చీదెళ్ళ కిషన్ గజమాలతో సత్కరించారు.ఈ సందర్భంగా పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ......జగన్మోహన్ రెడ్డి చరిష్మా తో ఈరోజు ప్రతి ఇంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఉన్నారని అన్నారు. వారందరూ జగన్మోహన్ రెడ్డి ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారని తెలిపారు. రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చినప్పటికీ పార్టీని సంస్థాగతంగా నిర్మాణం చేసుకునే దిశగా కృషి చేస్తున్నామన్నారు.అందులో భాగంగా అన్ని అనుబంధ సంఘాలకు..గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు.. కమిటీల నియామకాలను పూర్తి చేస్తున్నామన్నారు. అందులో భాగంగా నెల్లూరు జిల్లాలోపార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న వారందరికీ పార్టీ పదవుల్లో సముచిత ప్రాధాన్యత కల్పిస్తున్నామని తెలిపారు. కిషన్ మొదటి నుంచి పార్టీలో ఎంతో ఉత్సాహంగా ఉంటూ కష్టపడి పనిచేసే మనస్తత్వం గల వారిని తెలిపారు. కిషన్ సేవలను గుర్తించి ఈ రోజు యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.పార్టీ కోసం కష్టపడే మనస్తత్వమే కాకుండా ప్రజలకు సేవ చేయాలనే దృక్పథం కలిగిన వ్యక్తి కిషన్ అని కొనియాడారు.భవిష్యత్తులో కిషన్ ఇంకా.. మంచి స్థాయిలోకి రావాలని ఆశిస్తున్నానని తెలిపారు.ఈ కార్యక్రమంలో యువజన విభాగం నాయకులు చక్రి,వంశీ,పవన్,శ్రీకాంత్,నాగార్జున,కిషోర్, హంసా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.