మన న్యూస్ ,నెల్లూరు, జూన్ 1:- ఇక రేషన్ ఎప్పుడైనా తీసుకోవచ్చు.- త్వరలోనే మరిన్ని సరకులు అందించేందుకు ప్రభుత్వం కృషి.- రేషన్ దుకాణంలో సరకుల పంపిణీని ప్రారంభించిన ఎంపీ వేమిరెడ్డి, మంత్రి నారాయణ.కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన రేషన్ దుకాణాల వద్ద నిత్యావసరాల పంపిణీ వల్ల ప్రజలకు మేలు జరుగుతుందని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి అన్నారు. రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి పొంగూరు నారాయణ తో కలిసి ఆయన ఆదివారం జనార్ధన రెడ్డి కాలనీలో 102 నెంబర్ రేషన్ డిపో వద్ద పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి మంత్రి మాట్లాడుతూ .....ఎండియు వాహనాల ద్వారా రేషన్ ఇచ్చే విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసిందని, రేషన్ షాపుల ద్వారా అందించాలని ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించడం జరిగిందన్నారు. దీని ద్వారా ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. ఎవరూ తమ పనులు మానుకొని రేషన్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదన్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఎప్పుడైనా రేషన్ తీసుకోవచ్చని తెలిపారు. ఈ పాత విధానం ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని వివరించారు. రేషన్ దుకాణాల్లో తక్కువ ధరకే మరిన్ని సరకులు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ..... ఎండియూ వాహనాల ద్వారా రేషన్ ఇచ్చే విధాన్ని ప్రభుత్వం రద్దు చేసిందని, రేషన్ షాప్ ల ద్వారా అందించాలని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో 1 కోటి 46 లక్షల కార్డ్స్ ఉన్నాయని, ప్రతి నెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉదయం 8 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు రేషన్ సరుకుల పంపిణీ జరుగుతుందని, 65 సంవత్సరాలుపై బడిన వారికి దివ్యాంగులకు 1 వ తేదీ నుండి 5 వ తేదీలోగా ఇళ్ల వద్దే అందించడం జరుగుతుందన్నారు. ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. 42 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ రూ.2కే కిలో బియ్యం పథకం ప్రారంభమైనప్పటి నుంచి రేషన్ షాపులు అలాగే పనిచేసేవి.. ఈ ప్రక్రియను వైసీపీ ప్రభుత్వం మార్చి గందరగోళానికి తెరలేపిందన్నారు. MDU వాహనాలకోసం 1800 కోట్లు ఖర్చు చేసి , సక్రమంగా అందించక ప్రజలను ఇబ్బందులు పెట్టిందన్నారు.ఇంచార్జి కలెక్టర్ కార్తిక్, డిప్యూటీ మేయర్లు రూప్ కుమార్ యాదవ్, తహసీన్ తదితరులు ఉన్నారు.