మన న్యూస్,తిరుపతి, :
పదవి విరమణ పొందిన ట్రాఫిక్ ఏఎస్ఐ రాజారావును తిరుపతి ప్రైవేట్ ట్రావెల్స్ అసోసియేషన్ కన్వీనర్ బొడుగు మునిరాజా యాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సన్మానించారు. ఆయనకు శ్రీవారి చిత్రపటాన్ని బహూకరించారు. రాజారావు ఆరోగ్యవంతమైన శేష జీవితాన్ని గడపాలని బొడుగు మునిరాజు యాదవ్ ఆకాంక్షించారు. సన్మానించిన వారిలో ప్రైవేట్ ట్రావెల్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాసులు కోశాధికారి మల్లికార్జున సభ్యులు రవి రాము, మురళి, కమల్, పలువురు ట్రావెల్స్ యజమానులు ఉద్యోగులు పాల్గొన్నారు.