మన న్యూస్, తిరుపతి :- తన వృత్తిని దైవంగా భావించి ఎంతోమంది విద్యార్థుల ఉన్నతికి బాటలు వేసిన అధ్యాపకులుగా ఎం.రామచంద్ర నిలిచిపోతారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం చెప్పారు. శనివారం ఎస్.వి సంగీత నృత్య కళాశాల ఆడిటోరియంలో ఎస్వీ నాదస్వర డోలుపాఠశాల డోలు అధ్యాపకులు ఎం.రామ చంద్ర పదవి విరమణ సన్మాన సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం ఆయనను శాలువా కప్పి గజమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఎస్వీ సంగీత నృత్య కళాశాల ప్రిన్సిపాల్ ఉమా ముద్దు బాల , మృదంగం అధ్యాపకులు సుధాకర్ గారు నాదస్వర డోలు పాఠశాల హెచ్ఐ లక్ష్మీ సువర్ణ ప్రముఖ నాదస్వర విద్వాంసులు వి సత్యనారాయణ , ప్రముఖ డోలు విద్వాంసులు ఊట్లవారిపల్లి మునిరత్నం , గోవింద శెట్టి బాలచందర్ , కృష్ణారావు ఈ నాగరాజు , అవిలాల మునుస్వామి , ఎర్రయ్య,కృష్ణమూర్తి చంద్రశేఖర్ కేసన్న నారాయణ పాల్గొన్నారు.