చిత్తూరు,మన న్యూస్:- తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ను చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు డాక్టర్ సి.ఆర్ రాజన్ శాలువతో సన్మానించి సత్కరించారు.. కడప మహానాడు అంచనాలకు మించి లక్షలాదిగా తరలి రావడంతో కడప అడ్డ తెలుగుదేశం పార్టీ గడ్డ అని టిడిపి జిల్లా అధ్యక్షుడు సి ఆర్ రాజన్ తెలిపారు తెలుగుదేశం పార్టీ పేదల అభివృద్ధి కోసం కృషి చేస్తుందని తెలిపారు ఈ మహానాడు కు తరలివచ్చిన చిత్తూరు జిల్లా నాయకులకు కార్యకర్తలకు టిడిపి జిల్లా అధ్యక్షుడు సి ఆర్ రాజన్ కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ జయ చంద్ర నాయుడు నారా చంద్రబాబు నాయుడుని కలిసి సన్మానించి సత్కరించారు.