మన న్యూస్, నెల్లూరు:- రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ - నెల్లూరు సిటీలో మూడు చోట్ల ఎన్టీఆర్ సుజల సురక్షిత తాగునీటి వాటర్ ప్లాంట్ లు ప్రారంభం - మంత్రి నారాయణ పనితీరును అభినందించిన స్థానిక ప్రజలు- త్వరలో మరో మధర్ ప్లాంట్ ను జూన్ 15న ప్రారంభించనున్నట్లు వెల్లడి - మాపై కోపంతో అభివృద్ధి పథకాలన్నీ ఆపేసిన గత ప్రభుత్వం- గత పాలకుల అజ్ఞానంతో కోట్ల రూపాయల ప్రజాధనం వృధా - కూటమి ప్రభుత్వం వచ్చాక క్రమక్రమంగా రాష్ట్రంలో సుపరిపాలన - కొద్దిగా ఓపిక పడితే హామీలన్నీ నెరవేరుస్తాం - నెల్లూరును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతా - వెల్లడించిన రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఇచ్చిన మాట ప్రకారం నెల్లూరు ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడమే లక్ష్యంగా ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చి అనుకున్న లక్ష్యం మేర రెండు రూపాయలకే 20 లీటర్ల నీటిని అందజేస్తున్నట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సంతోషం వ్యక్తం చేస్తూ తెలియజేశారు. నెల్లూరులోని భగత్ సింగ్ కాలనీ, జనార్దన్ రెడ్డి కాలనీ, అంబేద్కర్ నగర్ లలో ఎన్టీఆర్ సుజల సురక్షత తాగునీటి ప్లాంట్ లను మంత్రి నారాయణ లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా ఆయా ప్లాంట్ ల వద్ద అధికారులు టిడిపి శ్రేణులతో కలిసి మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 2 రూపాయలకే 20 లీటర్లు అందించిన మంత్రి నారాయణకు ఈ సందర్భంగా స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. మంచినీటి దాతగా మంత్రిని మహిళలు అభివర్ణించారు. ముందుగా ఆయా డివిజన్లో పర్యటించిన మంత్రి నారాయణ కు స్థానిక ప్రజలు నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అందరినీ పేరుపేరునా ఆప్యాయంగా పలకరిస్తూ మంత్రి నారాయణ ముందుకు సాగారు. ఈ సందర్భంగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ నెల్లూరు నగర ప్రజలకు 2 రూపాయలకే 20 లీటర్ల నీటిని అందించటం ఆనందంగా ఉందన్నారు. 2018 లోనే ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ సుజలస్రవంతి పథకానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. 6 కోట్లతో 6 లక్షల లీటర్ల నీటిని అందించాలను కొన్నామన్నారు. ఇందుకోసం సంగం ప్రాజెక్ట్ నుంచి నీటినిbతెచ్చే స్పెషల్ డ్రైవ్ చేపట్టేమన్నారు. అయితే తమపై కోపంతో జగన్ ప్రభుత్వం ఈ పధకాన్ని ఆపేసిందని తెలిపారు. అజ్ఞానంగా వ్యవహరించి కోట్ల రూపాయల ప్రజా సొమ్మును వృధా చేసిందని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో నెల్లూరు సిటిలో మంచినీటి సమస్యను విస్మరించిందని దుయ్యబట్టారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిన ఇంటింటికి అందించాలని 3 మదర్ ప్లాంట్లు , 60 డిస్పెంన్సి౦గ్ యూనిట్ల ఏర్పాటుకు తిరిగి అనుమతులు ఇచ్చామని తెలిపారు. ఇందులో ఇప్పటికే రెండు మదర్ ప్లాంట్స్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. మరో మథర్ ప్లాంట్ జూన్ 15 తోపు ప్రారంభిస్తామని తెలియజేశారు. ఈ క్రమంలో ఈరోజు మూడు డిస్పెంన్సి౦గ్ యూనిట్ ల ను ప్రారంభించినట్లు తెలిపారు. నెల్లూరు సిటీ లో 3 లక్షల కుటుంబాలకు 2 రూపాయలకే 20 లీటర్ల మంచినీటిని అందిస్తామని ఘంటాపదంగా తెలిపారు. నెల్లూరు రూరల్ వాసులకు కూడా 2 రూపాయలకే 20 లీటర్ల మంచినీటిని అందిస్తామన్నారు. అవసరమైతే అదనపు ప్లాంట్ లు మంజూరు చేయిస్తామన్నారు. 550 కోట్లతో సంగం బ్యారేజ్ నుంచి మంచినీటిని తేవాలని 2014 లో సంకల్పించామని చెప్పారు. 85 శాతం పనులు కూడా పూర్తి చేసామన్నారు. ఆ పనులను కూడా మా మా పై కోపంతో గత పాలకులు ఆపేసారని దుయ్యబట్టారు. అయితే మరో ఏడాదిలోపే మిగిలిన పనులు కూడా పూర్తి చేస్తామని ఖరాఖండిగా తెలిపారు. ఖజానా ఖాళీ అయినా అభివృద్ధిని మాత్రం నిరాటంకంగా కొనసాగిస్తున్నామని చెప్పారు. కొద్దిగా ఓపిక పడితే హామీలన్నీ నెరవేరుస్తామని భరోసా ఇచ్చారు. నెల్లూరు ని దోమలు లేని నగరం చేయాలన్నదే లక్ష్యమని తెలియజేశారు. ఇందుకోసం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల్లో వేగం పెంచామన్నారు. సిటీ లో మిగిలి ఉన్న చిన్న ,పెద్ద డ్రైన్ల పనులన్నీ 300 కోట్లతో ఏడాదిలో పూర్తి చేస్తామని తెలిపారు. భగత్ సింగ్ కాలనీ వాసులకు ఇచ్చినమాట నిలబెట్టుకొన్నామని మంత్రి నారాయణ సంతోషంగా తెలియజేశారు. ఏళ్ళ తరబడి ఉన్న సమస్యను పరిష్కరించి సీఎం చేతులమీదగా ఇంటి పట్టాలను త్వరలోఅందజేయబోతున్నామన్నారు. గత ప్రభుత్వం మోసం చేస్తే మేము న్యాయం చేసామని మంత్రి నారాయణ చెప్పారు. పార్కుల అభివృద్ధికి పాటుపడిన వారందరికీ మంత్రి అభినందనలు తెలియజేశారు. నెల్లూరు నగరాన్ని అభివృద్ధిలో దేశానికే రోల్ మోడల్ గా నిలబెడతానని మంత్రి నారాయణ ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేషన్ కమీషనర్ నందన్, ప్రజారోగ్య శాఖ పర్యవేక్షక ఇంజినీరు మోహన్, మాజీ జెట్పిటీసి విజేతా రెడ్డి, టీడీపీ నగరాధ్యక్షులు మామిడాల మధు, కార్పొరేటర్ షఫియా భేగం, 54 వ డివిజన్ క్లస్టర్ ఇంచార్జ్ జహీర్, అధికారులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.