మన న్యూస్ ,కావలి ,మే 29:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏపీఎస్ ఎస్ డీసీ ఆధ్వర్యంలో ఈనెల 31వ తేదీన ఉదయం 9 గంటలకు కావలి పట్టణంలోని ఎమ్మెస్సార్ డిగ్రీ కాలేజీ నందు జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఇందులో సుమారుగా 23 కంపెనీలు పాల్గొని సుమారుగా 1200 మందిని నియమించడం జరుగుతుంది. కావలి నియోజకవర్గం లోని నిరుద్యోగ యువకులు ఈ జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోగలరు. ఈ జాబ్ మేళాలో పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటిఐ, డిప్లమా, పాలిటెక్నిక్ మరియు బీఫార్మసీ చేసిన నిరుద్యోగ్యవతి యువకులు పాల్గొనవచ్చని సంస్థ ప్రతినిధులు తెలిపారు.