మన న్యూస్, నెల్లూరు ,మే 29:*రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ పిలుపుతో కడపలో జరిగే మహానాడుకు భారీగా తరలి వెళ్లిన టిడిపి కార్యకర్తలు,అభిమానులు .*ప్రతి డివిజన్ నుంచి అనుచరగణంతో మహానాడు బాట పట్టిన నేతలు .*28 డివిజన్లలో పసుపు పండగ సందడి *జై తెలుగుదేశం నినాదాలో హోరెత్తిన నగర వీధులు *టీడీపీ క్యాడర్ లో ఉట్టిపడిన నూతనోత్తేజం *ఫుల్ జోష్ తో కనిపించిన తెలుగుదేశం పార్టీ నేతలు "సిటీ నియోజకవర్గం నుంచి 112బస్సులు ,సొంత వాహనాల్లో కడపకు పయనం *5 వేల మందికి పైగా మహానాడుకుతరలిన మంత్రి నారాయణ సైన్యం *మంత్రి ఆదేశాలతో ఆరువేల మందికి సరిపడా ఆహారం ,నీళ్ళు ఏర్పాటు చేసిన టిడిపి నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పసుపుదళం కదం తొక్కింది .తమ అభిమాన నేత రాష్ట్ర పురపాలకశాఖామంత్రి పొంగూరు నారాయణ పిలుపుతో చేయి చేయి కలిపి మహానాడు బాట పట్టింది .అధికారంలోకి వచ్చాక తొలిసారిగా నిర్వహిస్తున్న మహానాడుకు నియోజకవర్గం ఆరువేల మంది కి పైగా టీడీపీ కార్యకర్తలు ,అభిమానులు ,నేతలు వస్తారని అంచనా వేసిన మంత్రి అనుచరగణం అందుకుతగ్గ ఏర్పాట్లు చేసి అందరి ప్రశంసలు అందుకొంది .కడపజిల్లాలో నిర్వహిస్తున్న రాష్ట్ర పసుపు పండగ మహోత్సవ ముగింపు సభకు నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి మంత్రి నారాయణ సైన్యం తరలి వెళ్ళింది .నియోజకవర్గంలోని 28 డివిజన్లనుంచి 112 ప్రయివేట్ బస్సుల్లో టీడీపీ కార్యకర్తలు ,అభిమానులు డివిజన్ ఇంఛార్జులతో పాటు రాష్ట్రమహానాడుకు కదలివెళ్లారు .తెలుగుతమ్ముళ్ల ఉత్సహాన్ని ముందే అంచనా వేసిన మంత్రి నారాయణ ఆరు వేల మందికి సరిపడా ఆహారం ,ముప్పై వేల మంచినీటి బాటిళ్లు ఏర్పాటు చేసారు .మంత్రి నారాయణ ఆదేశాలతో టీడీపీ నేత వెమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి సిటీ లోని వెంకటేశ్వరపురం,పాలిటెక్నీక్ కాలేజ్ ,మైపాడు గేట్ ,రైల్వే ఫీడర్స్ రోడ్ ,నాలుగుకాళ్ల మండపం ,పాత మున్సిపల్ కార్యాలయం ,విఆర్సీ సెంటర్ లతో పాటు ,ఎస్విజీఎస్ కాలేజ్ మైదానంలో బస్ పాయింట్స్ ఏర్పాటు చేసి ఒక్కో బస్సుకు 50 ఆహారపొట్లాలను చేరవేశారు .అక్కడనుంచి డివిజన్ సెంటర్ లకు చేరిన బస్సుల్లో టీడీపీ కార్యకర్తలు ఉత్సహంగా కడప బయలుదేరారు .విక్టరీ సింబల్ చూపిస్తూ జై తెలుగుదేశం నినాదాలతో హోరెత్తించారు .దాంతో నగర వీధుల్లో పసుపు సందడి నెలకొంది .పార్టీ క్యాడర్ లొ నూతనోత్సహం వెల్లివిరిసింది .టీడీపీ నేతల్లో ఫుల్ జోస్ కనిపించింది.రాష్ట్రంలో రాక్షస పాలన పోయి నారా చంద్రబాబు నాయుడి ఆధ్వర్యంలో రామరాజ్యం నడుస్తోందని టీడీపీ నేతలు అంటున్నారు ..ఏడాదికాలంగా ప్రజలు సుఖసంతోషాలతో ప్రశాంతజీవనం గడుపుతున్నారన్నారు .మహానాడుకు రమ్మని మంత్రి నారాయణ ఇచ్చిన పిలుపుకు వేలాదిగా కార్యకర్తలు తరలి రావటం ఆనందంగా ఉందంటున్నారు. .