ఉదయగిరి, మన న్యూస్ : ఉదయగిరి మండలం గండిపాలెం గ్రామం నుండి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పిలుపుమేరకు గుంటుపల్లి మాలకొండయ్య చౌదరి పాముల రమణయ్య మరియు తెలుగుదేశం నాయకుల ఆధ్వర్యంలో దేవుని గడప కడపలో జరుగుతున్న మహానాడు కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుంటుపల్లి మాలకొండయ్య చౌదరి పాముల రమణయ్య ఆదేశాల మేరకు గండిపాలెం నుండి భారీ సంఖ్యలో మహానాడుకి తరలి వెళ్తున్నామని అందుకు తగిన ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఎక్కడ కార్యక్రమాలు నిర్వహించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాలతో ఎక్కడికైనా తరలి వెళ్లేందుకు సిద్ధంగా ఉంటామని పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని అన్నారు. కడపలో జరుగుతున్న మహానాడు కార్యక్రమానికి ఇప్పటికే లక్షల్లో తరలి వచ్చిన జనం కడప ను పసుపు మయం చేసిందని వారి సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు గొల్లపల్లి రమేష్ పాముల రాజా అహ్మద్ భాషా నవీన్ సుమన్ తదితరులు పాల్గొన్నారు.