
మన న్యూస్ ,నెల్లూరు:- ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అన్న స్పూర్తితో స్థాపించిన తెలుగుదేశం పార్టీతో ఆంధ్ర ప్రదేశ్ లో సంక్షేమ పాలన మొదలైంది.- చంద్రబాబు నాయకత్వంలో పని చేయడం చాలా సంతోషంగా వుంది.- కోవూరు, పడుగు పాడు, పోతిరెడ్డి పాళెం గ్రామాలను కోవూరు మున్సిపాలిటీగా మార్పుకు ప్రతి పాదన.- జిల్లా మహానాడు సందర్బంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.రాష్ట్ర మంత్రి నారా లోకేష్ రచ్చ గెలిచి ఇంట గెలిచారన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . కనుపర్తిపాడులోని విపిఆర్ కన్వెన్షన్ శుక్రవారం ఉదయం నిర్వహించిన నెల్లూరు పార్లమెంటరీ స్థాయి మహానాడులో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ .......అధికారంలో వున్నా లేకున్నా కార్యకర్తల సంక్షేమం పట్ల లోకేష్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారన్నారు. చంద్రబాబు నాయుడు ని అన్యాయంగ జైల్లో పెట్టినప్పుడు న్యాయం కోసం పోరాడి తండ్రిని జైల్లోంచి విడిపించి తీసుకొచ్చి తన పరిణితి చాటుకున్నారని ఆమె మంత్రి లోకేష్ ని కొనియాడారు. సమాజంలోని అట్టడుగు వర్గాలకు సామాజిక న్యాయం కోసమే నాడు అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారన్నారు. అప్పటి పటేల్ పట్వారీ వ్యవస్థలను రద్దు చేసి బహుజన రాజ్యం తెచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదేనన్నారు. ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అన్న స్పూర్తితో స్థాపించిన తెలుగుదేశం పార్టీతో ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ పాలన మొదలైంది అన్నారు. 83లో నాడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని ముందుకు నడపడంలో చంద్రబాబు నాయుడు పాత్ర అమోఘమన్నారు. సంక్షేమం అభివృద్ధి సమపాళ్లలో చేయగల సమర్ధత చంద్రబాబు నాయుడు కి వుందన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జండా మోసిన కార్యకర్తలకు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. దేశంలోనే 4 వేల రూపాయలు పెన్షన్ అందజేస్తున్నది ఒక్క ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోనే అన్నారు. పెన్షన్ పంపిణికి ప్రభుత్వం ఏటా 2 వేల 700 కోట్లు వెచ్చిస్తుందన్నారు. జూన్ 12 నుంచి మరో లక్ష మంది వితంతువులకు పెన్షన్ ఇవ్వనున్నట్లు ఆమె ప్రకటించారు. 203 నిరు పేదలకు అన్నా క్యాంటీన్ ద్వారా గౌరవ ప్రదంగా ఆకలి తీరుస్తున్నామన్నారు. త్వరలో ప్రభుత్వం మూడు లక్షల 50 వేల రేషన్ కార్డులు పంపిణీ చేయనుందని ఆమె తెలిపారు. సూపర్ సిక్స్ తో సహా ఎన్నికల సందర్బంగా చేసిన ప్రతి హామీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు నెరవేరుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయకత్వంలో పనిచేయడం చాలా సంతోషంగా వుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో కోవూరు నియోజకవర్గలో 11 సార్లు సీఎంఆర్ఎఫ్ చెక్కుల ద్వారా నిరుపేదలను ఆదుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కోవూరు నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన తీర్మానాలు ప్రవేశ పెట్టారు. కేంద్ర, రాష్ట ప్రభుత్వ సహకారాలతో కిసాన్ సెజ్ లో వ్యవసాయ సంబంధ పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. ముదివర్తి - ముదివర్తి పాళెం మధ్య పెన్నా నది పై కాజ్ వే నిర్మాణాన్ని వేగవంతం చేసి ఏడాదిలో పూర్తి చేసేలా ప్రయత్నిస్తానన్నారు. గత వైసిపి ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల కారణంగా కావలి రెవెన్యూ డివిజన్ లో కలిపిన విడవలూరు, కొడవలూరు మండలాలను తిరిగి నెల్లూరు రెవెన్యూ డివిజన్లో కలిపేందుకు కృషి చేస్తానని ప్రకటించారు. కోవూరు, పడుగుపాడు, పోతిరెడ్డి పాళెము గ్రామ పంచాయతీలను విలీనం చేసి కోవూరు మున్సిపాలిటీ ఏర్పాటుకు కృషితో పాటుమైపాడు, రామతీర్ధం బీచ్ లలో మౌలిక సదుపాయాలు కల్పించి టూరిజం అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కోవూరు నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రాలలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాల ఏర్పాటుతో పాటుప్రతి మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాల నిర్మాణానికి కృషి, పెన్నా డెల్టా ఆధునీకరణ, గ్రామీణ ప్రాంతాలలో సోలార్ పవర్ యూనిట్స్ తదితర అంశాలను ప్రస్తావించారు.




