మన న్యూస్, కావలి ,మే 17 :*అమృత పథకంలో జరిగిన అవినీతిని బహిరంగ పరుస్తాను.*చిరు వ్యాపారులకు శాశ్వత భద్రత.*నేను లోకల్ కాబట్టే కాపు కాస్తున్నాను. * అమృత పథకంలో జరిగిన అవినీతిని బహిరంగ పరుస్తాను .చిరు వ్యాపారులకు శాశ్వత భద్రత కల్పించాలని మున్సిపాలిటీకి ఆదాయ వనరులు చేకూర్చాలని కావలి పురపాలక సంఘ వాణిజ్య సముదాయ షాపు లు నిర్మించి ఇస్తున్నామని ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి చెప్పారు.. శనివారం ఉదయగిరి రోడ్డులో నిర్మించిన ఆరు షాపులను మున్సిపాలిటీ కమిషనర్ శ్రావణ్ కుమార్ తో కలిసి ప్రారంభించారు. ముందుగా స్థానిక నాయకులు భారీగా బాణాచంచా కాల్చి ఎమ్మెల్యే కి శాలువాలు కప్పి ఘనంగా స్వాగతం పలికారు. ఎమ్మెల్యే శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ....ఎన్నికలకు ముందు నన్ను నాన్ లోకల్ అన్నారు నేను లోకల్ అని మీరు తీర్పు ఇచ్చారు. నేను లోకల్ కాబట్టి కావలి ని కాపు కాసుకుంటున్నానన్నారు. కావలి అభివృద్ధి ఎంతో కృషి చేస్తున్నానారు.నా ప్రయత్నంలో ఎన్నో ఆటుపోట్లు ఎన్నో విమర్శలు ఎన్నో రకాల అవమానాలు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదురుకుంట్నానన్నారు.సమాజంలో సేవ చేయడానికి ఇంత అవమానాలు అన్నంతగా ఈరోజు అవమానిస్తున్నారన్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ లో వున్నా 175 నియోజకవర్గాల్లో మన కావలి ని అభివృద్ధి లో ప్రధమ స్థానంలో ఉంచేందుకు కృషి చేస్తానన్నారు.ఎవరు అభివృద్ధి చేసిన మన ఊరు అభివృద్ధి చెందుతుందని ఆలోచన వైసీపీ నాయకులుకు ఉండాలన్నారు.కావలి పట్టణంలో అన్ని సిమెంట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు.. అలాగే పార్కులు అభివృద్ధి చేస్తామన్నారు..ఉదయగిరి రోడ్లో ఇరువైపులా 650 షాపులు నిర్మించి ఇస్తున్నామన్నారు. దీనివల్ల చిరు వ్యాపారులకు భద్రత,, మున్సిపాలిటీ కి ఆదాయం చేకూరడంతో పాటు పట్టణం సుందరంగా ఉంటుందన్నారు. త్వరలోనే పైలాన్ ధ్వంసంపై అమృతం పథకంలో జరిగిన అవినీతిపై గ్రూపులతో సహా బహిరంగంగా మీడియాకు వెల్లడించబోతున్నామన్నారు.దమ్ముంటే వైసీపీ నాయకులు మీ మాజీ ఎమ్మెల్యే ని తీసుకొని రావాలన్నారు.