కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: మే16: బద్వేల్ జడ్పీ హైస్కూల్లో, మరియు సాధన ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో 2024-2025 సంవత్సరంలో టెన్త్ క్లాసులో ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారమును, గురువారం బద్వేల్ లోని సాధన ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గాజులపల్లి వెంకట సుబ్బారెడ్డి, సముద్రాల శ్రీనివాసులు, లయన్ యోగయ్య, ఆధ్వర్యంలో ప్రతిభ పురస్కారాలు అందించడం జరిగింది. ఈ సందర్భంగా వెంకటసుబ్బారెడ్డి మాట్లాడుతూ, బద్వేల్ జడ్పీ హైస్కూల్లో 600 మార్కులకుగాను అతికారి దక్షిత 591 మార్కులు,తుడిమెల్ల నాగ శ్రీనిత్య 582 మార్కులు, పఠాన్ తన్విరూల్ హసన్ 578 మార్కులతో మొదటి మూడు స్థానాలు సంపాదించుకోగా, అలాగే బద్వేల్ లోని సాధన ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో పండుగాయల భరత్ మహి స్వాత్విక్ 580 మార్కులు, నల్లబల్లి అనిత 584 మార్కులు, ఊరిబిండి సౌమ్య లు 560 మార్కులు మొదటి మూడు స్థానాలు పొందినందుకు, వారికి మా ఫ్రెండ్స్ సేవ సంఘం తరఫున ప్రోత్సాహంగా మొదటి బహుమతి 6.000/- రూపాయలు, రెండవ బహుమతి 5.000/- రూపాయలు, మూడో బహుమతి 4.000/-రూపాయలుగా, మొత్తం ఆరు మంది విద్యార్థులకు మొత్తం 30 వేల రూపాయలు నగదును, మరియు వారి ఫోటోతో మా సంఘం పేరుతో ఉన్నటువంటి మెమెంటోలను, వారి తల్లిదండ్రులను షాల్వాలతో సత్కారము, స్పీటు బాక్సులతో వారికి అందించడమే కాక మధ్యాహ్న భోజనాలు కూడా ఏర్పాటు చేయడం, సుమారు 70 మంది పాల్గొనడం జరిగిందని వారు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ,హెడ్మాస్టర్ కొమ్మరగిరి శ్రీనివాసరావు, గంగసాని సాంబశివారెడ్డి, ట్రెజరర్ సముద్రాల, సాధన శ్రీనివాసులు, జెపి రవికుమార్,.ఊరుబిండి జయరాంరెడ్డి,పఠాన్ ఆయూబ్ ఖాన్, గంటా రాజశేఖర్, అంబవరం జయరామిరెడ్డి, బండి మునీంద్ర, నడిగడ్డ మురళి, బింగుమల్ల సుబ్రహ్మణ్యం, టంగుటూరు సుబ్బారావు, షేక్ అబ్దుల్ సత్తార్, ఓలేటి శంకరయ్య, మధుళ్ళపల్లి చంద్రశేఖర్, మోడం బాలయ్య, దర్గా సలీం, రుద్రవరం సుధాకర్, అనుకొలు చిన్న సుబ్బారెడ్డి, పిల్లి భాస్కర్, పత్తి కృష్ణయ్య, కోటవీది రమేష్ లు, ప్రోత్సాహకాలు అందుకున్న విద్యార్థి, విద్యార్థినుల తోపాటు వారి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు కూడా పాల్గొనడం జరిగింది.