మన న్యూస్, కావలి ,మే 13:- రాజకీయ చదరంగంలో భాగమే పైలాన్ విధ్వంసం- నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులకు అభినందనలు- కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి వెల్లడిప్రెస్ విలువలను దిగజార్చిన రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పే విధంగా త్వరలో ప్రభుత్వ అధికారుల సమక్షంలో, తెలుగుదేశం, జనసేన, బిజెపీ నాయకుల సమక్షంలో, జిల్లా ప్రెస్ సంబంధించినటువంటి యూనియన్ ప్రెసిడెంట్ల అందరినీ కూడా కావలికి ఆహ్వానించి కావలిలో ఉన్నటువంటి ఆందరి రిపోర్టర్ల సమక్షంలో కావలిలో ప్రెస్ క్లబ్ కి శంకుస్థాపన చేస్తామని కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి తెలిపారు. మంగళవారం కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..... సమాజంలో ఉండేటువంటి సమస్యలను ఎలుగేత్తి చాటి ప్రజలను చైతన్య పరిచేటువంటి ప్రెస్ పేరు చెప్పి 2020 ఏప్రిల్ 11వ తేదీ అర్ధరాత్రి ప్రెస్ కి ఒక కళంకాన్ని తెచ్చి, ప్రెస్ ముసుగులో కొంతమంది చేసినటువంటి దురాఘతానికి పైలాన్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి స్తూపాన్ని కూల్చిన ముద్దాయలను అరెస్ట్ చేసిన కావలి పోలీసు వారిని, జిల్లా ఎస్పీ ని అభినందిస్తున్నామన్నారు. కావలి ప్రెస్ ప్రతినిధులు ఎవ్వరు కూడా పొరపాటు చేసేటువంటి వ్యక్తులు కాదని, ప్రెస్ ముసుగులో కొంతమందిని ప్రలోభ పెట్టి రాజకీయ నాయకులు చేసిన రాజకీయ చదరంగంలో పైలాన్ని కూల్చడం జరిగిందని, వారిని కనిపెట్టి మీడియా యొక్క విలువను కాపాడిన పోలీసు ఉన్నతాధికారులందరినీ కూడా అభినందిస్తున్నానని అన్నారు. నూతనంగా శంకుస్థాపన చేసే ప్రెస్ క్లబ్, నిజమైన ప్రెస్ క్లబ్ అనే విధంగా కావలిలో సంఘసేవ చేసేటువంటి అన్ని ప్రజా సంఘాలను, అన్ని పార్టీల నాయకులను, అందరి ప్రెస్ వాళ్ళని, అధికారులని ఆహ్వానించి ఒక వేదిక మీద ప్రెస్ క్లబ్ కు భూమి పూజ కార్యక్రమాన్ని దొంగచాటుగా కాకుండా, దుర్మార్గమైన పనులతో కాకుండా, అధికారుల అనుమతులతో ప్రభుత్వ స్థలంలో ప్రెస్ క్లబ్ ని కట్టించి ఇవ్వబోతున్నామని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ప్రెస్ వారిని గౌరవిస్తుందని, ఎప్పుడు కూడా ప్రెస్ కి అండగా ఉంటుందన్నారు. సమాచారాన్ని అందించడంలో గాని, మీరు ఇచ్చినటువంటి సూచనలను పాటించడంలో గాని, సమాజంలో ఉన్నటువంటి లోపాలని వెలుగెత్తి చాటినప్పుడు దాన్ని సాదరంగా ఆహ్వానించడంలో ఎప్పుడు కూడా కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సాదరంగా ఆహ్వానిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కావలి పట్టణ టీడీపీ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, రాష్ట్ర కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ పోతుగంటి అలేఖ్య, కండ్లగుంట మధుబాబు నాయుడు, తదితరులు పాల్గొన్నారు.