మన న్యూస్, నెల్లూరు ,మే 7:- 10 ఆంధ్ర నేవల్ యూనిట్ యన్ సి సి, నెల్లూరు లెఫ్టినెంట్ కమాండర్ మరియు క్యాంపు కమాండెంట్ గణేష్ గొదంగవే అధ్యక్షతన జరిగిన యన్ సి సి యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్-3 శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని సరస్వతి నగర్ అక్షర విద్యాలయ నందు గత పది రోజులుగా జరిగిన క్యాంపును జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ సందర్శించారు. నిన్న సాయంత్రం కేడేట్లు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి పులకించి వివిధ విభాగాలలో ప్రతిభ కన బరచిన ఎన్ సి సి కేడేట్లకు ప్రతిభా ధ్రువీకరణ పత్రాలు,జ్ఞాపికలు ప్రదానం చేసి అభినందనలు తెలిపారు. అనంతరం కలెక్టర్ ఓ ఆనంద్ మాట్లాడుతూ ఎన్సీసీలో చేరే అవకాశం అందరికీ రాదని ఎన్సిసి లో చేరినందుకు మీరు అదృష్టవంతులని ఎన్సీసీలో చేరడం వల్ల విద్యార్థుల్లో దేశభక్తి సామాజిక సేవ నాయకత్వ లక్షణాలు పోరాటపటిమ సేవా భావం తదితర ఎన్నో మంచి లక్షణాలు అలవాడతాయని తద్వారా ఉత్తమ పౌరులుగా ఎతగడానికి ఎన్సీసీ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని ఈ పది రోజులపాటు జరిగినటువంటి శిక్షణలో ఇటువంటి మరెన్నో విషయాలను మీరు తెలుసుకుని ఉంటారని విద్యార్థుల్లో జాతీయ సమగ్రతను పెంపొందించడానికి ప్రతి పాఠశాలలో ఎన్సిసిని ప్రవేశపెడతామని అన్నారు. అనంతరం జిల్లా స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ యతి రాజ్, క్యాంప్ కమాండెంట్ గణేష్ గొదంగవే క్యాంప్ అడ్జటెంట్ గుండాల నరేంద్ర బాబు ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఎన్సిసి క్యాడేట్ల తో కలిసి విందును ఆరగించారు. పది రోజుల ఎన్సిసి క్యాంపు ముగింపు సందర్భంగా క్యాంపు కమాండెంట్ గణేష్ గొదం గవే డ్రిల్లు, ఫైరింగ్, రాత పరీక్ష, సాంస్కృతిక కార్యక్రమాలలో ప్రతిభ కనపరిచిన కేడేట్లకు సర్టిఫికెట్లు, ట్రోఫీలు అందజేసి అభినందించారు. భవిష్యత్తలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో ఎన్సిసి క్యాంపు అడ్జటెంట్ ఆఫీసర్ గుండాల నరేంద్ర బాబు,థర్డ్ ఆఫీసర్లు మస్తానయ్య, కొండారెడ్డి,విద్యా సాగర్, అరోరా, సాయి శంకరి,దివ్య, పి ఐ స్టాఫ్ వైకుంఠం చీఫ్ ఇన్స్ట్రక్టర్, పెట్టీ ఆఫీసర్లు రంజన్, లోకేష్, లక్ష్మణ్, దీపక్,వెంకటేష్, రమణారావు, నవీన్, ఆఫీస్ సూపరింటెండెంట్ ముకుంద సాగర్, షిప్ మోడలింగ్ ఇన్స్ట్రక్టర్ ఎస్. వి. రామన్, కార్యాలయ సిబ్బంది షెహనాజ్ బేగం, కల్పన, సుజాత, వివిధ కళాశాలలు, పాఠశాలలకు చెందిన 600 మంది ఎన్ సి సి కేడేట్లు
పాల్గొన్నారు.