మన న్యూస్ ,కావలి ,మే 5: రాజకీయ నాయకులకు ఆదర్శప్రాయుడు కలికి యానాది రెడ్డి అని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి అన్నారు. సోమవారం మాజీ మంత్రి కలికి యానాదిరెడ్డి 19వ వర్ధంతి సందర్బంగా ఎమ్మెల్యే నాయకులతో కలిసి ఉదయగిరి బ్రిడ్జి సెంటర్లో ఉన్న యానాది రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. యానాది రెడ్డి ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిసి మంత్రిగా చేసి ఆదర్శప్రాయుడిగా నిలిచారన్నారు.