మనన్యూస్,కోవూరు:10 తరగతిలో 590 మార్కులు సాధించిన ఊటుకూరు పెద్దపాళెం గ్రామానికి చెందిన మీనం తులసీరాం అనే విద్యార్థిని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సన్మానించారు. ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రోత్సాహం అందిస్తానన్నారు. ఈ సందర్భంగా తులసీరాంను ఆదర్శంగా తీసుకొని కష్టపడి చదవాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి విద్యార్థులకు సూచించారు. ఊటుకూరు పెద్దపాళెం గ్రామానికి చెందిన విద్యార్థులు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి తో గ్రూప్ ఫోటో దిగారు.