అక్రమ సంబంధమే హత్యకి కారణమని తేల్చిన పోలీసులు.
మనన్యూస్,జోగులాంబ గద్వాల:19-04-2025 మధ్యాహ్నం గట్టు మండలం బసాపురం శివారులో ఇంకుడు గుంతల కొరకు పనులు చేసే దగ్గర మట్టి కుప్ప నుండి దుర్వాసన వచ్చి పరిశీలించగా గుర్తు తెలియని శవం అనుమానస్పద స్థితిలో కనిపించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు.కేటీదొడ్డి మండలం బసాపురం శివారులో మృతి చెందిన వ్యక్తి నర్శింహులు (28) భార్య పద్మమ్మ వరుసకు మామ అయినా అంజలప్పుతో వివాహేతార సంబధం పెట్టుకొని మరో ఇద్దరు సహాయంతో గొంతుకోసి హత్యకు పాల్పడినట్లు నిర్ధారించిన పోలీసులు వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలింపూ.