
శంఖవరం మన న్యూస్ (అపురూప్): ప్రభుత్వం తక్షణమే ఉగ్రవాద దాడులపై చర్యలు చేపట్టాలని ఉగ్రవాదులు దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతున్నారని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు, "కుడా" (కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) చైర్మన్ తుమ్మల రామస్వామి (బాబు) అన్నారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లోని బైసారన్ పర్వత శిఖరం సమీపంలోని గడ్డి మైదానంలో పర్యాటకుల బృందంపై మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఉగ్రవాదులు పాయింట్ - బ్లాంక్ రేంజ్లో కాల్పులు జరిపి చంపారు. ఈ ఉగ్ర దాడిలో ఇద్దరు విదేశీయులతో సహా మొత్తం 28 మంది మరణించారు. మరో ఆరుగురు గాయపడ్డారు. లష్కర్ అనుబంధ సంస్థ రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ దాడికి బాధ్యత వహించింది. ఈ అత్యంత దారుణమైన అమానవీయ, అనూహ్య ఘటనకు జనసేన పార్టీ ప్రతిస్పందించింది. ఈ దాడిలో మృతులకు మూడు రోజుల పాటు శాంతియుత సంతాప దినాలను పాటించాలని పార్టీ పిలుపును ఇచ్చింది. ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త మేడిశెట్టి సూర్యకిరణ్ (బాబి) ఆధ్వర్యంలో శంఖవరం మండలం కత్తిపూడిలో కన్నీటి నివాళి సంతాప దీక్ష కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. మృతులకు అంజలి ఘటించారు. మౌనం పాటించారు. ఘన నివాళులు అర్పించారు. 28 మంది పర్యాటకుల కుటుంబాల పట్ల తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ గ్రామీణ ఎమ్మెల్యే పంతం నానాజీ, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు, "కుడా" (కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) చైర్మన్ తుమ్మల బాబు, జిల్లా పార్టీ ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు కరణం సుబ్రహ్మణ్యం, జిల్లా టెలికమ్యూనికేషన్స్ సలహా మండలి సభ్యులు మేకల కృష్ణ, శంఖవరం మండల అధ్యక్షుడు గాబు సుభాష్, ఉపాధ్యక్షుడు తలపంటి అప్పారావు (బుజ్జి), ఏలేశ్వరం మండల అధ్యక్షులు పెంటకోట మోహన్, శృంగవరం ఎంపీటీసీ గాది రాజబాబు, నియోజకవర్గ జనసేన నాయకులు, కార్యకర్తలు గౌతు లక్ష్మీ, ఎస్.జయబాబు, బంక కోదండ రాంబాబు, పిల్లా పద్మరాజు, పోసిన శ్రీను, అమరాది శివ, అచ్చే వీరబాబు, సిరిపురం శ్రీను, గుండెం సత్తిబాబు, కర్రి వీరబాబు, కొయ్యా శ్రీను, పక్కుర్తి సతీష్, నిర్జ నాగు, ఆర్.అర్జున్, తుమ్మల సత్యేంద్ర, కోరుప్రోలు రమేష్, వేల్పుల ప్రసాద్, తలపంటి వీరబాబు, సలాది విష్ణు, కుండల సాయి, తలపంటి హనుమంతు, కొయ్యా శ్రీను, కీర్తి కుమార్, పిల్లి దుర్గ, గాబు కృష్ణార్జున ప్రసాద్, బొజ్జ వెంకటేష్, జాన్ (నెల్లిపూడి), ముఖే వీరబాబు, దితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.