Mana News , శ్రీకాళహస్తి :- ఎన్నికల ప్రచారంలో చెప్పిన మాట, చేసిన వాగ్దానాన్ని తుచ తప్పకుండా అమలు చేసి, చెప్పిన విధంగానే మెగా డియస్సీ నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగ యువతీ యువకులకు చంద్రబాబు ఉద్యోగాల కల్పతరువులా నిలుస్తున్నాడని తెలుగుదేశం పార్టీ, బిసి విభాగం నాయకులు కొనియాడారు. ఇచ్చిన మాట ప్రకారం 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి, ఎంపికైన అభ్యర్థులకు రెండు నెలల్లో పోస్టింగులు ఇచ్చేలా చర్యలు తీసుకున్న చంద్రబాబు ప్రభుత్వానికి ఉపాధ్యాయ ఉద్యోగార్ధులు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారని పేర్కొన్నారు. 2014-2019 మధ్యకాలంలో 18 వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేసిన చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న తన హయాంలో డీఎస్సీ ప్రక్రియను చేపట్టి, 11 నోటిఫికేషన్ల ద్వారా 1,80,208 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసి, లక్షలాది కుటుంబాలలో వెలుగులు నింపిన గొప్ప మానవతా మూర్తి మన చంద్రబాబు అని కొనియాడారు. ఇప్పుడున్న టీచర్లలో ఎక్కువమంది చంద్రబాబు హయాంలో పోస్ట్ లు పొందినవారే అని గుర్తు చేశారు. జగన్ దగాకు - చంద్రబాబు విరుగుడు మోసపూరిత మాటలు చెప్పి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకాన్ని భ్రమలో పెట్టి 2019 లో అధికారం చేపట్టిన తరువాత జగన్ చేసిన దగాకోరు పనులకు చంద్రబాబు విరుగుడు చేస్తున్నాడని కొనియాడారు. సీఎం కాగానే డీఎస్సీ నోటిఫికేషన్ అని ఎన్నికల సయయంలో హామీ ఇచ్చిన జగన్ రెడ్డి సీఎం అయ్యాక టీచర్ల భర్తీని అటకెక్కించేశారని ఆరోపించారు. జంబో డీఎస్సీ, మెగా డీఎస్సీ అంటూ 5 ఏళ్ల పాటు విద్యార్థుల జీవితాలతో ఆటలాడి, 2024 ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు 6100 పోస్టులతో డీఎస్సీ ప్రకటించి, నోటిఫికేషన్ రిలీజైన 30 రోజుల్లోనే పరీక్షలంటూ మెలిక పెట్టిన మహా మాయగాడు జగన్ అని దుయ్యబట్టారు. ఉపాధ్యాయుల్ని మద్యం షాపుల ముందు కాపలా పెట్టించడం, అప్రెంటీస్ విధానం అంటూ పిచ్చి పిచ్చి చేష్ఠలతో నిరుద్యోగులను వంచించిన మోసగాడు జగన్ రెడ్డి అని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వన్నియకుల క్షత్రియ సంక్షేమ మరియు అభివృద్ధి డైరెక్టర్ మిన్నల్ రవి, తెలుగుదేశం పార్టీ బిసి విభాగం శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మునిరాజా యాదవ్, నాయీ బ్రాహ్మణ సాధికార సమితి, తిరుపతి పార్లమెంటు సోషల్ మీడియా కన్వీనర్ కోట చంద్రశేఖర్,బిసి నాయకుడు కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.