MANA NEWS: బిసి విభాగం,తెలుగుదేశం పార్టీశ్రీకాళహస్తి.అభివృద్ధికి ఆద్యుడు, సంక్షేమానికి ఆరాధ్యుడు, 75 వసంతాలుగా వెలుగొందుతోన్న చంద్రుడు, తెలుగు వారి గుండె గుడిలో కొలువైన నిండు దైవమైన చంద్రన్నకు దివ్యాంగులు ఆశీస్సులు అందజేశారు.సిబియన్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆదివారం స్థానిక పూసల వీధిలో తెలుగుదేశం పార్టీ బిసి విభాగం ఆధ్వర్యంలో దివ్యాంగుల సమక్షంలో, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చేతుల మీదుగా కేక్ చేశారు. అనంతరం వారికి సుధీర్ రెడ్డి స్వయంగా కేక్ తినిపించి సంతోష పరిచారు.దివ్యాంగుల జీవితాలకు భరోసా ఇస్తూ, తమకు అండగా నిలబడుతున్న స్వర్ణాంధ్ర రూపకర్త, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు డెబ్బై ఐదవ జన్మదినాన్ని తమ చేతుల మీదుగా జరిపించే అవకాశం కల్పించిన సుధీర్ రెడ్డి కి దివ్యాంగుల కుటుంబీకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నారు.వినూత్న ఆలోచనలకు నిలువెత్తు రూపమైన చంద్రబాబు పుట్టినరోజు ప్రపంచంలో గల తెలుగు వారందరికీ పండుగ రోజు అని సుధీర్ రెడ్డి కొనియాడారు.అటు సంక్షేమానికి, ఇటు అభివృద్ధికి సమ ప్రాధాన్యత ఇస్తూ ఏడు పదుల వయస్సులో కూడా ఎక్కడా అలసత్వం చూపకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్న నిత్యకృషీవలుడు అయిన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ అని సుధీర్ రెడ్డి కొనియాడారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రెడ్డి వారి గురవారెడ్డి,రాష్ట్ర కార్యదర్శులు దశరధాచారి, గాలి చలపతి నాయుడు,వన్నియకుల క్షత్రియ సంక్షేమ మరియు అభివృద్ధి డైరెక్టర్ మిన్నల్ రవి,బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు,సాంస్కృతిక విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నెమళ్ళూరు బుజ్జి, శ్రీకాళహస్తి పురపాలక సంఘం 18 వ వార్డు మాజీ కౌన్సిలర్ డా.నివేదిత మోరె, పేట బాలాజీ రెడ్డి, నాయీ బ్రాహ్మణ సాధికార సమితి, తిరుపతి పార్లమెంటు సోషల్ మీడియా కన్వీనర్ కోట చంద్రశేఖర్,తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పొన్నారావు, మైనారిటీ విభాగం తిరుపతి పార్లమెంటు నాయకుడు సయ్యద్ చాంద్ బాషా, వజ్రం కిషోర్, శ్రీకాళహస్తి పట్టణ సహకార బ్యాంకు మాజీ వైస్ ఛైర్మన్ షేక్ ఖాదర్ బాషా,నూర్ మొహమ్మద్, షేక్ రియాజ్,ముజీబ్, ఆదిల్,సులేమాన్, అస్మత్,అహ్మద్, భగత్,శేఖర్, బిసి విభాగం నాయకులు దొరైరాజ్ రెడ్డి,యం.యస్.రెడ్డి, సంజకుల.మురళి, భాస్కర్ గౌడ్,ఆనంద్ గౌడ్,దాము, భాస్కర్,మణి, రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.