కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: ఏప్రిల్ 20:
బద్వేలు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బద్వేల్ నియోజకవర్గంలోని ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు మరియు వివిధ ప్రజాసంఘాల నాయకుల ఆధ్వర్యంలో మాదిగ ఉద్యోగుల సమాఖ్య బద్వేల్ నియోజకవర్గ అధ్యక్షులు యర్రపల్లి ఓబయ్య ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలోని రిజర్వేషన్లకు పొందుపరిస్తే ఆ రిజర్వేషన్లను అభినవ అంబేద్కర్, మహాజన నేత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాలగా నిరంతరం అలుపెరుగని పోరాటాలు చేసి నేడు లిఖిత భారత రాజ్యాంగం లోని రిజర్వేషన్లను సామాజిక న్యాయ సిద్ధాంతం ప్రకారం అన్ని కులాల వారి వారి జనాభా ధమాషా ప్రకారం పంచి పెట్టడం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారధ్యంలో కేంద్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు నందు ఆప్టిడవిట్ దాఖలాలు చేయడం సుప్రీంకోర్టు నందు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు రావడం ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా కార్యరూపం దాల్చడం మొదలు అన్ని విషయాలలో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు మరియు మాదిగ ఉద్యోగ సంఘాల జాతీయ నాయకులు సిరంగి దేవానందం, సీనియర్ నాయకులు జాలా గురవయ్య, ఎస్సీ కార్పొరేషన్ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హనుమంతు వెంకటసుబ్బయ్య, ఓ సూరి విజయభాస్కర్, ఇసుకల జయచంద్ర బాబు,అనకర్ల ఆనందరావు, చాట్ల జగన్మోహన్, గుడిమే ప్రతాప్, సోమిరెడ్డిపల్లి జయచంద్ర, సిరంగి సునీత, సివి రమణ, పిడతల వెంకటేష్, దాసరిపల్లి సురేష్, నాగిపోగు రాజారావు,బొజ్జ కృష్ణయ్య, పసుపుల ప్రశాంత్,వడ్డేపోగు రవి, గొల్లపల్లి జయరాజు, తెల్ల ఓబులేష్, గొడుగునూరు రాజేంద్ర ప్రసాద్, ముండ్లపాటి పిచ్చయ్య, గొల్లపల్లి ప్రభుదాస్, నాగిపోగు ప్రసాదు, అనకర్ల సుందర్ రావు, లక్కినేని చిన్న, గుడిమే దిలీప్, బద్వేల్ నియోజకవర్గ ఎంఆర్పిఎస్ అధ్యక్షులు నాగిపోగు ప్రసాదు, బద్వేల్ శౌరి, తలారి నాగరాజ్, బత్తలకూరి శ్రీనివాసులు, బత్తలకూరి రామయ్య, శ్రీనివాసులు, పంతులయ్య, సుంకర రవి తదితరులు పాల్గొన్నారు.