పినపాక, మన న్యూస్ : మణుగూరు సబ్ డివిజన్ ఏరియాలో గుడ్ ఫ్రైడే సందర్భంగా మణుగూరు ప్రాంత నివాసి సామాజిక కార్యకర్త లాయర్ కర్నే రవి క్రైస్తవ సోదరీ సోదరీమణులకు ఉపవాస దీక్షలు పురస్కరించుకొని పీవీ కాలనీ ఏరియాలో పాదయాత్ర చేస్తున్నటువంటి క్రైస్తవ సోదరీ సోదరీమణులకు 300 మందికి ఫ్రూట్ జ్యూస్ అందజేశారు. ఈ సందర్భంగా తాను మాట్లాడుతూ యోషయా గ్రంథం రచించబడిన 700 సంవత్సరాల తర్వాత యూదుల కులంలో కన్య,, యేసేపు లకు యేసు క్రీస్తు జన్మించాడు. యేసు జన్మ గురించి క్రొత్త నిబంధనలోని మత్తయి సువార్త 1:18-25, లూకా సువార్త 1:26 లో వ్రాయబడిఉంది. అయితే యేసు క్రీస్తు కాలానికి ఇశ్రాయేలు దేశం అంతా రోమన్స్ పరిపాలనలోకి వెళ్ళిపోయింది.బాల్యంనుండే ఆధ్యాత్మిక చింతన అలవర్చుకొన్న ఏసు క్రీస్తు సమాజంలో అణగద్రొక్కబడినవారిని అక్కున చేర్చుకొన్నాడు. సంఘ సంస్కర్తగా అప్పటి సమాజంలో మంచి మార్పు తీసుకురావడానికి ప్రయత్నించాడు, రాజ్యాంగం వంటి యూదుల పాత నిబంధన ధర్మశాస్త్రాన్ని సులభతరం చేసి క్రొత్త నిబంధనగా బోధించాడు. [యేసుక్రీస్తు] బోధనలకు పలు యూదులు, ఇతర జాతుల వారు ప్రభావితులయ్యారు. రోమా సామ్రాజ్యపు రాజులకు, యూదుల్లో మత చాందసులకు ఏసుక్రీస్తు బోధనలు నొప్పి కలిగించాయి. యూదుల్లో కొంతమంది మత చాదస్తులు యేసుక్రీస్తును దైవ ద్రోహిగా, దేశ ద్రోహిగా చిత్రీకరించి, చివరికి రోమా సామ్రాజ్యపు రాజులకు అప్పగించారు. యూదుల కోరిక ప్రకారం రోమన్ రాజు ఏసు క్రీస్తును అత్యంత కిరాతకంగా సిలువ వేయించారు. తర్వాత శిలువ కారణంగా మృతి చెందిన ఏసు క్రీస్తును దైవ కుమారుడని యూదులు, రోమన్స్ అంగీకరించారు. ఆనాటినుండి క్రైస్తవం అనే మార్గం వాడుకలోకి వచ్చింది. ప్రపంచమంతా విస్తరించసాగింది. క్రీస్తు సమాకాలిక శిష్యులు, భక్తులు క్రొత్త నిబంధన రచించారు.