మనన్యూస్,తిరుపతి:తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాలపై టిటిడి మాజీ చైర్మన్ భువన కరుణాకర్ రెడ్డి దుష్ప్రచారం చేయడం తగదని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ హితవు పలికారు. ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి సుగుణమ్మ మీడియాతో మాట్లాడారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో గోశాలలోని గోవులకు కావలసిన అన్ని సౌకర్యాలు, వసతులు కల్పించడం జరిగిందన్నారు. అలాంటి గోశాలపై గతంలో టీటీడీ చైర్మన్ గా కరుణాకర్ రెడ్డి దుష్ప్రచారం చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. సకల దేవతలకు నిలయం గోమాత అని, ప్రతి హిందూ ఇళ్లల్లో గోమాతకు పూజ చేస్తుంటామని, ఆ గోవులపై లేనిపోని ఆరోపణలు భక్తుల మనోభావాలను దెబ్బతీయటమేనని పేర్కొన్నారు. ఒక నాస్తికుడుగా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డికి గోమాత గురించి ఏమి తెలుసు నని ప్రశ్నించారు. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రజలు మీకు 11 సీట్లకే పరిమితం చేసిన వైసిపి నాయకులకు బుద్ధి రాలేదని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మ రెడ్డిలు టీటీడీ ప్రాశస్త్యాన్ని తగ్గించేందుకు ఎన్ని కుట్రలు చేసినా శ్రీవారి ముందు మీ ఆటలు కొనసాగలేదన్నారు. భవిష్యత్తులో ఇలాంటి చీప్ పాలిటిక్స్ కు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని భూమన కరుణాకర్ రెడ్డి అండ్ కో కు మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ హెచ్చరించారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ, టిడిపి రాష్ట్ర నేతలు సూరా సుధాకర్ రెడ్డి, దంపురి భాస్కర్ యాదవ్, బుల్లెట్ రమణ, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి ఆర్పీ శ్రీనివాసులు, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి కంకణాల రజనీకాంత్ నాయుడు, టిడిపి తిరుపతి నగర మహిళా అధ్యక్షురాలు బ్యాంకు శాంతమ్మ పాల్గొన్నారు.