మనన్యూస్,పాచిపెంట:పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట లో మహిళా సంఘాలు అభివృద్ధి,సంక్షేమం ధ్యేయంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని రాష్ట్ర సెర్ఫ్ అదనపు సీఈవో కే శ్రీరాములు నాయుడు వెల్లడించారు. శనివారం నాడు మండలం విచ్చేసిన సందర్భంగా వెలుగు కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వార్షిక అప్పులు జీవనోపాదుల గురించి ఆయన మహిళా సంఘాల ప్రతినిధులతో చర్చించారు. ఆయనతోపాటు డిఆర్డిఏ పిడి సుధారాణి సమావేశానికి హాజరయ్యారు.వార్షిక అప్పులు మరియు జీవనోపదులు గురుంచి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక యాప్ రూపొందించి రాష్ట్రంలో ఒక లక్ష 50 వేలు మంది ఎన్యూమీటర్ లను ఏర్పాటు చేసి సర్వే నిర్వహిస్తున్నారనీ అదనపు సీఈఓ తెలిపారు.ఈ సర్వే జరుగుతున్న తీరును రాష్ట్ర సెర్ప్ అదనపు సీఈఓ కె.శ్రీరాములు నాయుడు
గంగమ్మ గ్రామ సంఘం పరిధిలో సర్వే జరుగుతున్న తీరును పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సంఘాలు సభ్యులు ఒక గ్రూపు గా ఏర్పడి ఆదాయం వచ్చే ఏక్టివిటీ నిర్వహిస్తే, అధిక ఆదాయం వస్తుందని, ఆ విధంగా ఆలోచన చెయ్యాలని తెలిపారు. ప్రస్తుతం స్త్రీ నిధి పథకంలో తీసుకొన్న రుణాలకు రూ 0.90 శాతం వడ్డీ పడగా, ఆ వడ్డీని 0.70 శాతానికి తగ్గించడానికి ప్రణాళికులు సిద్ధం చేస్తున్నామని, ఎక్కువ మంది సబ్యులు స్త్రీ నిధి పథకంలో అప్పులు తీసుకోవాలని, అలాగే మహిళా సంఘాలు సభ్యులు పొదుపు నుండి కూడా అప్పులు తీసుకొని, సంఘం ఆదాయం పెంచాలని కోరారు.గతంలో తీసుకొన్న అప్పులు ఏ జీవనోపాధి కోసం వినియోగించారని సభ్యులను ప్రశ్నించగా, అదే గ్రామానికి
చెందిన లక్ష్మీ గణపతి సంఘానికి చెందిన రౌతు లక్ష్మీ గతంలో తీసుకొన్న బ్యాంక్ లింకేజ్ రుణం రూ. 70 వేలు తీసుకున్నామని రోజుకు 10 లీటర్లు పాలు అమ్మగా, నెలకు రూ 12 వేలు ఆదాయం వస్తుందని అదనపు తెలియజేశారు. అలగే అదనపు సీఈఓ సర్వే చేస్తున్న
ఎన్యూమునీటర్ జట్ల పార్వతి మాట్లాడి సబ్యులకు సర్వే ఏ విధంగా చేస్తున్నావని, ఒక సభ్యురాలు ఆదాయం ఏ విదంగా లెక్కిస్తున్నారని ప్రశ్నించగా..? ప్రస్తుతం వస్తున్నా ఆదాయంలో ఖర్చులు పోనీ వచ్చిన మొత్తాన్ని ఆదాయంగా లెక్కిస్తున్నామని తెలుపగా, అదనపు సీఈఓ సంతృప్తి చెందారు. అలాగే మహిళా సంఘాలు సభ్యులు తప్పనిసరిగా ప్రతి నెల సమావేశాల పెట్టుకోవాలని, ఈ ఏడాది నుండి ప్రతి సంఘం ఒక సమావేశం స్థలం నిర్ణయించుకొని, జియో ఫినిషింగ్ చెయ్యాలని, ఇకనుండి ప్రతి సంఘం ఆ స్థలానికి వెళ్ళి సమావేశం పెట్టుకుంటేనే సమావేశం పెట్టినట్లు అవుతుందని తెలియజేశారు. పాడేరు, విశాఖపట్నం జిల్లాలో పర్యటించానాని, అమ్మలసలో ఎన్యూమీటర్ లకు ఈ సర్వే పై పూర్తి అవగాహన ఉందని తెలియజేశారు.
ఈ సమావేశంలో మన్యం జిల్లా
డిఆర్డిఏ పీడీ సుధారాణి, ఇన్ చార్జి ఏసి శివున్నాయుడు, సీసీ లు పి. రామకృష్ణ రావు, కె. భాస్కరరావు పాల్గొన్నారు.