మన న్యూస్,నిజాంసాగర్,జుక్కల్,
మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఓ నిందితుడికి ఐదు ఏండ్లు కఠిన కారాగార శిక్ష, రూ. 2 వేలు రూపాయలు జరిమానా విధిస్తూ కామారెడ్డి మొదటి అదనపు జిల్లా జడ్జి లాల్ సింగ్ శ్రీనివాస్ నాయక్ తీర్పు వెల్లడించినట్లు నిజాంసాగర్ ఎస్ఐ శివకుమార్ తెలిపారు. ఎస్ఐ శివకుమార్ తెలిపిన వివరాల ప్రకారం...మహమ్మద్ నగర్ మండలంలోని బూర్గుల్ గ్రామానికి చెందిన ఆరు సంవత్సరాల మైనర్ బాలిక పై షేక్ షాదుల్ గత 2021వ సంవత్సరం జనవరి 16 వ తేదిన మైనర్ బాలిక తల్లి దండ్రులు వ్యవసాయ పనులకు వెళ్ళిన సమయంలో బాధితురాలు గ్రామంలోని ప్రకృతి వనంలో బాధితురాలు, బాధితురాలు చెల్లెలు మరియు స్నేహితురాలీ తో ఆడుతుండగా నిందితుడు చెరుకు గడ్డ ఇస్తా అని చెప్పి బాధితురాలీని ఇంట్లోకి పిలిచి లైంగిక దాడికి పాల్పడినట్లు పేర్కొన్నారు.వెంటనే బాధితురాలు చెల్లెలు మరియు స్నేహితురాలు అక్క అక్క అని అరవగా నిందితుడు చెంప పై కొట్టి పారిపోయినాడు, బాధితురాలు వారి తల్లితండ్రులు వ్యవసాయ పనుల నుండి ఇంటికి రాగానే జరిగిన విషయం తల్లితండ్రులకు తెలుపగా బాధితురాలు తల్లి నిజాంసాగర్ పోలీసు స్టేషన్ వచ్చి పిర్యాదు చేయగా కేసు నమోదు చేసినారు.కేసు యొక్క సాక్ష్యాధారాలను బట్టి ఏప్రిల్ 2025 ఏప్రిల్ 10 వ తేదిన కామారెడ్డి ఫస్ట్ అడిషనల్ డిస్ట్రక్ సెషన్ జడ్జి పోక్స్ లాలాసింగ్ శ్రీనివాస్ నాయక్ నిందితునికి 5 సంవత్సరాల కటినా కారాగార జైలు శిక్ష,రూ.2000 జరిమానా విధించినట్లు తెలిపారు. బాధితురాలికి రూ.2 లక్షల నష్ట పరిహారం అందజేశారు. దీంతో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర కోర్టు కానిస్టేబుల్ కిషన్, ప్రస్తుత సబ్ ఇన్స్పెక్టర్ శివ కుమార్, సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజేష్ లను అభినందించారు.