మనన్యూస్,నెల్లూరు:అట్టహాసంగా 50 రోజుల గడపగడపకు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కార్యక్రమం.
కొత్త కాలువ సెంటర్ లో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి భారీ ఘన స్వాగతం.భారీ గజమాలతో అభిమానాన్ని చాటుకున్న టిడిపి నేతలు.
50 కేజీల కేక్ కట్ చేసిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కొత్త కాలువ సెంటర్ లో తెలుగుదేశం పార్టీ పతాక స్థూపాన్ని ఆవిష్కరించిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 1వ డివిజన్ కొత్త కాలువ సెంటర్ నందు మంగళవారం గడపగడపకు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి 50వ రోజు వేడుకలను ఘనంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు.మూడుసార్లు వరుసగా ఒక నియోజకవర్గంలో విజయం సాధించడం ఓ చరిత్ర.సార్వత్రిక ఎన్నికల్లో మమ్మల్ని ఓడించాలన్న వేలకోట్ల కోటీశ్వరుల కుట్రలు అన్నీ అభాసు పాలయ్యాయి అని టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు.నెల్లూరు రూరల్ ప్రజల అభిమానం ముందు కుట్రలు సాగలేదు అని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్ఫూర్తితో గడపగడపకు గిరిధర్ రెడ్డి కార్యక్రమాన్ని చేపట్టాం అని టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు.ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా 50 రోజులు పాటు గడప గడపకు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కార్యక్రమం దిగ్విజయంగా ముందుకు సాగింది అని టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు.
నెల్లూరు రూరల్ ప్రజల రుణం తీర్చుకోవాలనే లక్ష్యంతోనే స్థానికంగా ప్రజా సమస్యలను గుర్తిస్తున్నాం, ఎన్నికలు ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజల్లోనే ఉంటాం అని టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు.ప్రజల కోసమే మా అడుగులు ప్రజల కోసమే మా పోరాటం. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పట్ల రూరల్ ప్రజలకున్న అభిమానంతోనే 35 వేల భారీ మెజారిటీ సాధించాం అని టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు.నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని మొత్తం 18 గ్రామ పంచాయతీలతోపాటు నగర పరిధిలోని నాలుగు డివిజన్లలో గడపగడప కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించాం అని టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు.ప్రజలు నుంచి అనేక విజ్ఞప్తులు, స్థానికంగా పలు సమస్యలను నా దృష్టికి తీసుకువచ్చారు.వాటిలో 40% సమస్యలను పరిష్కరించాం. మిగతా సమస్యలను కూడా అతి త్వరలోనే పరిష్కరిస్తాం అని టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు.
మా కోసం కష్టం చేసిన ప్రతి కార్యకర్తను గుర్తుపెట్టుకుంటాం అని టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు.