మనన్యూస్,నెల్లూరు:రైతులు, కార్మికులకు రావాల్సిన బకాయిలు చెల్లింపులు మరియు
షుగర్ ఫ్యాక్టరి భవిషత్ కార్యాచరణ పై తో చర్చలు.రైతు సంఘ నాయకులు, కార్మిక సంఘ నేతల అభిప్రాయాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకళ్తాను.దశాబ్ద కాలానికి పైగా నిరుపయోగంగా కోవూరు కో ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరి భవిషత్ కార్యాచరణ పై రైతు సంఘ నాయకులతో కలిసి సోమవారం కలెక్టర్ ఓ ఆనంద్ తో చర్చించారు. రైతులు మరియు కార్మికుల బకాయిలు త్వరగా చెల్లించేలా కృషి చేయాలని కలెక్టర్ ను కోరారు. చక్కెర కర్మాగారం పునః ప్రారంభం చేసినా లాభసాటి కాదన్న ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి, కలెక్టర్ కలెక్టర్ ఆనంద్ వాదనలతో రైతు సంఘ నాయకులు ఏకీభవించారు. షుగర్ ఫ్యాక్టరికి చెందిన 124 ఎకరాల భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఎపి ఐ ఐ సి అప్పగించేందుకు భాగస్వామ్య రైతులు సహకరించాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి, కలెక్టర్ కలెక్టర్ ఆనంద్ సూచనలకు రైతు సంఘ నాయకులు అంగీకరించారు. షుగర్ ఫ్యాక్టరి పునః ప్రారంభం, యితర భూ వివాదాలకు సంబంధించి వివిధ కోర్టులలో వున్న న్యాయపర వివాదాలు చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు రైతు సంఘ నాయకులు సమ్మతించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ షుగర్ ఫ్యాక్టరి సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించిన వెంటనే మానవతా దృక్పధంతో స్పందించి కార్మికుల రావాల్సిన 28 కోట్లు బకాయిలు చెల్లించేందుకు సమ్మతించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి ధన్యవాదాలు తెలిపారు. చక్కర కర్మాగార భవితవ్యంపై రైతు సంఘ నాయకులు, కార్మిక సంఘ నేతల అభిప్రాయాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకళ్తానన్నారు. కోవూరు ప్రాంత అభివృద్ధికి కార్మిక మరియు రైతు సంఘ నాయకులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పెన్నా డెల్టా ఛైర్మన్ జెట్టి రాజగోపాలరెడ్డి, రైతు సంఘ నాయకులు గండవరపు శ్రీనివాసులు రెడ్డి, హరిరెడ్డి, తిరుమూరు అశోక్ రెడ్డి, జెట్టి రవీంద్ర రెడ్డి, బెజవాడ వంశీకృష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.